BHNG: తుర్కపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో పదవతరగతి పరీక్షా కేంద్రాలను కలెక్టర్ అనురాగ్ జయంతి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, గైర్హాజరు వివరాలను సంబంధిత పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటిండెంట్లను అడిగి తెలుసుకున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద త్రాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులను ప్రధాన గేట్ వద్ద పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలన్నారు