KMM: ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూములపై యధాస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని ఖమ్మం కలెక్టర్, ఆర్డీవో, తాహసీల్దార్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసలైన లబ్ధిదారులను గుర్తించి, ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ భూదాన్ భూముల్లో ఇళ్ల స్థలం, ఇల్లు మంజూరు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. బాధితులు హైకోర్టును ఆశ్రయించగా బుధవారం ఈ ఆదేశాలు వెలువడ్డాయి.