NLG: నల్గొండ మున్సిపల్ అధికారుల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు తెరలేపారు. ప్రాపర్టీ టాక్స్, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించాలని ఫోన్లు చేస్తూ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని కోరుతున్నారు. ఇటీవల ఓ ఆసుపత్రికి ఇలాగే ఫోన్ రాగా, యాజమాన్యం అధికారులను సంప్రదించడంతో ఈ మోసం బయటపడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు లింకులు, స్కానర్ల ద్వారా డబ్బులు చెల్లించవద్దని ప్రజలకు సూచన చేశారు.