WGL: నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ సేవలు సరిగా అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రక్తం, మూత్ర పరీక్షలు తదితర సేవలు అందుబాటులో లేకపోవడంతో రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని బంధువులు తెలిపారు. దీంతో వైద్య అధికారులు స్పందించి ల్యాబ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చి రోగులకు న్యాయం చేయాలని కోరారు.