KMM: కామేపల్లి మండలం కొత్త లింగాలలోని శ్రీ కోట మైసమ్మ అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమాన్ని రేపు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభిస్తారని మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, సర్పంచ్ శ్రీనివాస్ ఇవాళ ప్రకటించారు. వారితోపాటు తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ & రైతు కమిషన్ సభ్యులు రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి పాల్గొంటారని వెల్లడించారు.