KNR: మాజీ మంత్రి జీవన్ రెడ్డి అంశంపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందించారు. ఆయన సీనియర్ నాయకుడని, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ప్రాధాన్యం కోరలేదని తెలిపారు. స్థానిక సమస్యల కారణంగానే అసంతృప్తి నెలకొన్నట్టు పేర్కొన్నారు. ఈ అంశంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మాట్లాడి పరిష్కారం చూపాలని అభిప్రాయపడ్డారు. అవసరమైతే తాను కూడా చర్చిస్తానని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.