TPT: సూళ్లూరుపేటలో వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆర్డీవో జెండా ఊపి ప్రారంభించారు. ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 40% పైగా వికలాంగులకు ఈ సదుపాయం కల్పించింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గోపీనాథ్ రెడ్డి, ఎంపీడీవో మురళి, డిపో మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. అధికారులు ఈ పథకం వికలాంగులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.