E.G: నల్లజర్ల మండలం వ్యాప్తంగా ఆదివారం అక్షరాంధ్ర రాత పరీక్షలు నిర్వహించారు. 91 కేంద్రాలలో 3,608 మంది నిరక్షరాస్యులకు పరీక్షలు జరిగాయి. వీటిని ఎంపీడీవో సత్యనారాయణ స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వయోజన విద్య కార్యక్రమంలో భాగంగా వీరిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు అధికారులు ఈ పరీక్షలు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో తెలిపారు.