HYD: హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు చివరి దశకు చేరుకున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 98 శాతం పనులు పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్ట్ రూ.35.61 కోట్లతో రూపుదిద్దుకున్నట్లు వివరించారు. రైల్వే శాఖలో ఇదొక ‘ఇంజనీరింగ్ మార్వెల్’ అంటూ కేంద్ర మంత్రి అభివర్ణించారు. త్వరలోనే మల్కాజ్గిరి, హైటెక్ సిటీ, హఫీజ్ పేట ప్రాంతాల్లో పునరుద్ధరించినట్లు తెలిపారు.