NRPT: కృష్ణ మండలం చేగుంటలో మాజీ ఎంపీపీ లింగప్ప కుటుంబంపై దాడి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ స్తంభం విషయంలో తలెత్తిన వివాదం క్రమంలో బీజేపీ సర్పంచ్ కుమారుడు సహా మరికొందరు దాడికి పాల్పడ్డారని బాధితులు తెలిపారు. ఈ ఘటనలో లింగప్ప తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా, వెళ్తున్న కారును కుడా రాళ్లతో అడ్డుకున్నారని ఆరోపించారు.