మధ్యధరా సముద్రంలో 120 మంది వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. దీంతో 80 మందికి పైగా గల్లంతైనట్లు UNO వెల్లడించింది. లిబియాలోని తజౌరా నుంచి బయలుదేరిన ఈ పడవ ప్రతికూల వాతావరణం కారణంగా నీరు చేరి సముద్రంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న ఇటలీ తీర రక్షక దళం 32 మందిని సురక్షితంగా రక్షించింది. గల్లంతైన మిగిలిన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.