AKP: పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా టీకాలు వేయించాలని నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వెంకటరమణ, తాండవ ప్రాజెక్ట్ ఛైర్మన్ సత్యనారాయణ సూచించారు. నాతవరం మండలం గుమ్మనపూడిలో గాలికుంటు వ్యాధి నివారణ కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. వచ్చేనెల 29 వరకు పశువైద్య సిబ్బంది గ్రామాలకు వెళ్లి పశువులకు వ్యాక్సిన్ వేస్తారన్నారు.