SKLM: వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురంలో మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే శిరీష ఆదేశాల మేరకు రాష్ట్ర అగ్ని కుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పి.ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం గ్రామంలోని నీటి కుళాయిల వద్ద కొత్త ట్యాపులు ఏర్పాటు చేసి లీకులను సరిచేశారు. వేసవిలో నీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.