PDPL: ప్రజల భాగస్వామ్యంతో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం విజయవంతం చేయాలని కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. ఇవాళ ఆయన రామగిరి మండలం, కల్వచర్లలో జరిగిన గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. 99 రోజులలో చేపట్టే పనులపై గ్రామ సభలో అవగాహన కల్పిస్తారని తెలిపారు. వివిధ అభివృద్ధి పనులపై ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చని సూచించారు.