WNP: గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఆదివారం పెద్దమాడూరు గ్రామంలో రూ.21 లక్షలతో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో అంతర్గత రోడ్లు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. పెండింగ్లో ఉన్న పనులు దశాలవారీగా పూర్తి చేస్తామన్నారు.