ATP: గుంతకల్లు మున్సిపాలిటీలోని గుంత బావి నుండి పోలీస్ క్వార్టర్స్ వరకు జరుగుతున్న తాగునీటి పైప్లైన్ కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా వాహనదారులు వేరే దారి గుండా వెళ్లాలని మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పైప్ లైన్ మరమ్మతుల అనంతరం యధావిధిగా ఈ రహదారి గుండా వాహనాలు వెళ్తాయని అప్పటివరకు పట్టణ ప్రజల సహకరించాలన్నారు.
ELR: చింతలపూడి మండలం పాత చింతలపూడి గ్రామంలో పార్టీ సభ్యత్వ కార్డులను నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడా నాగభూషణం ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు బోడా అనిష్ కుమార్ మాట్లాడారు. 2 సంవత్సరాలకు కలిపి రూ.100 చెల్లిస్తే రూ.5 లక్షల ప్రమాద బీమాను మంత్రి నారా లోకేష్ వర్తింపచేయడంతో, టీడీపీ మెంబర్ షిప్ తీసుకోవడం ఎంతో మంచిదన్నారు.
NLG: పెద్దవూర మండలం నాయిన వాని కుంట తండా అంగన్వాడీ కేంద్రంలో, సోమవారం చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం అంగన్వాడీ టీచర్ నారాయణమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రానికి వచ్చే చిన్నారులకు ప్రభుత్వం సరఫరా చేసే బాలామృతం, గుడ్లు పంపిణీ చేస్తున్నామని పోషక లోపం కలిగిన చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నామని అన్నారు.
సత్యసాయి: మడకశిర మండలం నీలకంఠాపురంలో కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 18 జంటలకు ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించారు. భద్రాచలం సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలతో నీలకంఠాపురంలోని ఆలయంలో ఈ వివాహాలను జరిపించారు. వధూవరులకు నూతన వస్త్రాలు, తాళిబొట్లు, కాలిమెట్టెలు అందజేసి భోజనం ఏర్పాటు చేశారు.
WGL: మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసి సాధారణ జీవితం గడపాలని వరంగల్ సీపీ సన్రైత్ సింగ్ పిలుపునిచ్చారు. సోమవారం వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో ఫిబ్రవరి 21న వరంగల్ సీపీ ఎదుట లొంగిపోయిన నిషేధిత మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యురాలు కేశే అలియాస్ జెన్నీకి ఆమెపై ప్రభుత్వం ప్రకటించిన రూ.4లక్షల రివార్డ్ను అందజేశారు.
ATP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి రానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హెలిప్యాడ్ వద్ద ఏర్పాట్లను ఎమ్మెల్సీ తులసిల రఘురాం, జిల్లా వైసీపీ నేతలు పరిశీలించారు. ఏర్పాట్లపై పోలీసులతో మాట్లాడారు. మంగళవారం ఉదయం 10:40 గంటలకు జగన్ హెలిప్యాడ్కు చేరుకుంటారని వైసీపీ నేతలు తెలిపారు. అనంతరం రోడ్డు మార్గాన పాపిరెడ్డిపల్లెకి వెళ్తారు.
SRD: ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లకు రక్షణ కల్పించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. డ్రైవర్లపై వేధింపులను ఆపాలని కోరారు. ప్రభుత్వం వీరిని అన్ని విధాలుగా ఆదుకోవాలని పేర్కొన్నారు.
NGKL: కోడేరు మండలం కొండ్రావుపల్లిలో అనారోగ్య బాదితలను కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి సోమవారం పరామర్శించారు. అనారోగ్యంతో చికిత్సపొంది విశ్రాంతి తీసుకుంటున్న జూపల్లి శ్రీనివాసరావు, అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణయ్య లను వారి వారి నివాసాలలో హర్షవర్ధన్ రెడ్డి పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ELR: నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెట్రి సెల్వి, జేసీ ధాత్రి రెడ్డి, ఎస్పీ ప్రతాప్ కిషోర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలపై వచ్చిన అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను పరిశీలించి వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
AP: శ్రీరామనవమి సందర్భంగా DY CM పవన్ భద్రాచలం వెళ్లాల్సి ఉంది. అయితే TG CM రేవంత్ భద్రాచలం పర్యటనకు వెళ్లనుండటంతో పవన్ పర్యటనను రద్దు చేసుకోమని అధికారులు కోరారట. శ్రీరామనవమి వేళ భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని.. ఈ సమయంలో పవన్ వస్తే భద్రతా ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు తెలిపారని సమాచారం. దీంతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా పవన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారని తెలుస్తోంది.
BPT: ప్రజలు వ్యవసాయ భూములు, స్థలాలు అమ్మడం లేదా కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కేవలం 15నిమిషాల్లో పూర్తి అవుతుందని రెవెన్యూ&రిజిస్ట్రేషన్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం బాపట్లలో మాట్లాడారు. వెబ్సైట్లో క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి, స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు అని తెలిపారు.
KMR: గిరిజన భవనం ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు దేవున్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గిరిజన నాయకులను పోలీసులు నేడు అరెస్టు చేశారు. గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మోతీరాం నాయక్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుని వినోద్ చౌహన్లను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
ముంబై స్టార్ పేసర్ బుమ్రా దాదాపు మూడు నెలల తర్వాత మైదానంలోకి అడుగు పెట్టబోతున్నాడు. నేడు RCBతో జరగనున్న మ్యాచ్లో ఆడతాడని MI కోచ్ జయవర్ధనె ఇప్పటికే వెల్లడించాడు. ఈ క్రమంలోనే RCB ప్లేయర్ టిమ్ డేవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా వేసే తొలి బంతిని తమ ఓపెనర్లు ఫోర్ లేదా సిక్స్ కొడతారని తెలిపాడు. కాగా, టిమ్ డేవిడ్ గతేడాది MI తరఫున ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.
మేడ్చల్: గుండ్లపోచంపల్లి పరిధిలోని జయభేరి ఎన్ఎక్లేవ్ వద్ద లోడుతో వెళ్తున్న ఓ ఆటో బోల్తా పడింది. స్థానికుల వివరాలు.. మేడ్చల్- కొంపల్లికి వెళ్తున్న ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్, క్లీనర్కు గాయాలయ్యాయి. 108కు సమాచారం ఇవ్వగా వారిని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ ఓవర్ స్పీడ్ ఈ ప్రమాదానికి కారణమని తెలిపారు.
హైదరాబాద్: తుకారంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాస్టర్ అజయ్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. హిందు దేవుళ్లను విమర్శిస్తూ అనవసరంగా మత కల్లోలాలకు తెర లేపుతున్నారంటూ రోమన్ క్యాథలిక్ జోసఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై కూడా అర్ధరహితంగా ప్రచారం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.