చైనా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ బీవైడీ.. తన ప్రీమియం మోడల్ డెంజా Z9జీటీను ఐరోపాలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కారును 5 నిమిషాల్లోనే 10 నుంచి 70 శాతం వరకు ఛార్జ్ చేయొచ్చని సంస్థ తెలిపింది. -30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నా 20-97 శాతం ఛార్జింగుకు 12 నిమిషాలే పడుతుందని చెప్పింది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 800 కి.మీ వరకు ప్రయాణించవచ్చని పేర్కొంది.
MBNR: పాలమూరు యూనివర్సిటీలో యువతకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఓ రెండు ఫౌండేషన్లు ముందుకొచ్చాయి. ఫౌండేషన్ ప్రతినిధులు శుక్రవారం వీసీ ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్ను కలిసి ఈ విషయంపై చర్చించారు. యువతకు లైఫ్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్స్, ఎంబ్రాయిడరీ వంటి కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
సన్రైజర్స్ లీడ్స్ ఫ్రాంఛైజీ పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను కొనుగోలు చేయడంపై SMలో వివాదం నెలకొంది. దీనిపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. ఈ అంశం బీసీసీఐ పరిధిలోకి రాదని తెలిపారు. ఇతర దేశాల లీగ్ల్లో ఫ్రాంఛైజీ నిర్ణయాల విషయంలో బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చి చెప్పారు. అయితే వివాదంపై కావ్య మారన్ స్పందించాల్సి ఉంది.
1879: నోబెల్ బహుమతి గ్రహీత, భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ జననం1883: రాజకీయ ఆర్థిక వేత్త కారల్ మార్క్స్ మరణం1918: తెలుగు సంగీత దర్శకుడు కె.వి.మహాదేవన్ జననం1937: పద్మశ్రీ అవార్డు గ్రహీత జొన్నలగడ్డ గురప్ప శెట్టి జననం2008: శంషాబాద్ విమాశ్రయం ప్రారంభమైన రోజుఅంతర్జాతీయ గణిత దినోత్సవం.
తమిళ లెజెండరీ నటుడు MGRను గురించి తను చేసిన వ్యాఖ్యలపై తెలుగు నటుడు రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెప్పారు. తను MGRను దైవంలా భావిస్తానని.. తెలుగు నటుడు కాంతారావును ప్రశంసించే క్రమంలో తను నోరుజారినట్లు ఒప్పుకున్నారు. అయితే అవి ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని స్పష్టం చేశారు. కాగా కాంతారావును చూసి MGR భయపడేవారని రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రొటోకాల్స్ వివాదంపై బన్ని మేనేజర్ శరత్ చంద్ర స్పందించాడు. అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాడు. అల్లు అర్జున్ను కలవడం కష్టమని అనుకుంటే పొరపాటే అవుతుందని పేర్కొన్నాడు. ఇటీవల ఓ బ్రాండ్ స్ట్రాటజర్ బన్నీ కలవాలంటే 42 నిబంధనలు పాటించాలంటూ వ్యాఖ్యనించటం తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.
స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడిన వీడియో అనలిస్ట్ రాజారెడ్డిపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. రెండేళ్ల కిందట ఆంధ్ర vs మధ్యప్రదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో అతను ఫిక్సింగ్కు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టిన బీసీసీఐ.. నేరం రుజువు కావడంతో కండక్ట్ కోడ్ ఆర్టికల్స్ 2.1.3, 2.1.14 కింద చర్యలకు ఉపక్రమించింది. అతడిపై జీవితకాల నిషేధం విధించింది.
TG: సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ వద్ద దారుణం చోటుచేసుకుంది. స్టేషన్ నుంచి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడు బోడుప్పల్కు చెందిన నిత్యతేజగా గుర్తించారు. నిన్న సాయంత్రం 6 గంటలకు తేజ స్టేషన్ నుంచి ఒక్కసారిగా కిందకు దూకాడు. తీవ్రగాయాలైన అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే తేజ మృతి చెందిన వైద్యులు నిర్థారించారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం; శిశిర రుతువు, ఫాల్గుణ మాసం, బహుళ పక్షం ఏకాదశి: పూర్తి ఉత్తరాషాఢ: తె. 3-02 తదుపరి శ్రవణ వర్జ్యం: ఉ. 9-48 నుంచి 11-32 వరకు అమృత ఘడియలు: రా. 8-08 నుంచి 9-52 వరకు దుర్ముహూర్తం: ఉ. 6-14 నుంచి 9-48 వరకు రాహుకాలం: ఉ. 9-00 నుంచి 10-30 వరకు సూర్యోదయం: ఉ.6.14; సూర్యాస్తమయం: సా.6.06
AP: రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి పంటలపై అవగాహన కల్పిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం అన్నం తినేవారు తగ్గిపోతున్నారని.. రైతులు గమనించాలని సూచించారు. డిమాండ్ ఆధారిత పంటలు వేసేలా రైతులను ప్రోత్సహిస్తామని చెప్పారు. నూజివీడు మామిడికి, అరకు కాఫీకి, గుంటూరు మిరపకు చాలా ప్రసిద్ధి అని వెల్లడించారు. ఏలూరు సమీపంలో 500 ఎకరాల్లో కోకో సిటీని తెస్తున్నట్లు పేర్కొన్నారు.
TG: రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ కోసం మౌలిక వసతులు, అగ్రి ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్ర ఉద్యాన రంగానికి.. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, పసుపు, మిర్చి వంటి పంటలకు ఎగుమతుల్లో మంచి అవకాశాలున్నాయని తెలిపారు. సరఫరా, ప్యాక్ హౌస్లు, కోల్డ్ స్టోరేజీ, లాజిస్టిక్స్ మెరుగపడేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
TG: దేశంలో వరి ఉత్పత్తిలో రాష్ట్రం తొలి స్థానంలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో పోటీపడేలా గ్రేడింగ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్ చేస్తున్నట్లు చెప్పారు. ఉత్పత్తి పెరిగిన నేపథ్యంలో రైతులకు మెరుగైన ఆదాయం అందించడానికి ఎగుమతులు, ఫుడ్ ప్రాసెసింగ్లపై దృష్టిని సారించినట్లు తెలిపారు.
హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చే థైరాయిడ్ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం, అధిక నీరసం, జుట్టు రాలడం వంటివి దీని ప్రధాన లక్షణాలు. థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి అయోడిన్ కలిగిన ఉప్పును తగినంత మోతాదులో తీసుకోవాలి. ఏవైనా మార్పులు గమనించినప్పుడు వెంటనే రక్త పరీక్ష చేయించుకుని డాక్టర్ సలహా మేరకు మందులు వాడటం శ్రేయస్కరం.
బీర్ల విక్రయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే చారిత్రక లార్డ్స్ స్టేడియంలో త్వరలో బీర్ల అమ్మకాలు నిలిచిపోనున్నాయి. సరఫరాదారు బ్రూడాగ్ తో ఒప్పందం ముగియడంతో మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త బ్రాండ్తో ఒప్పందం కుదిరినా, అది అందుబాటులోకి రావడానికి సమయం పట్టనుంది. దీంతో తదుపరి మ్యాచ్ల వరకు స్టేడియంలో మద్యం సరఫరా ఉండదని అధికారులు స్పష్టం చేశారు.