హైదరాబాద్: తుకారంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాస్టర్ అజయ్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. హిందు దేవుళ్లను విమర్శిస్తూ అనవసరంగా మత కల్లోలాలకు తెర లేపుతున్నారంటూ రోమన్ క్యాథలిక్ జోసఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై కూడా అర్ధరహితంగా ప్రచారం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
మేడ్చల్: ఆరోగ్య సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రష్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కిరణ్ స్కూల్ ఆధ్వర్యంలో5కే సైకిల్ ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు.
అన్నమయ్య: కలికిరి మండలంలో 2019 – 24 మధ్య పక్కా ఇల్లు మంజూరై నిర్మాణంలో వివిధ దశలలో ఉన్న వాటిని పూర్తి చేయడానికి అదనపు నిధులు మంజూరు చేయనున్నట్లు సోమవారం ఎంపీడీఓ భానుమూర్తి రావు తెలిపారు. గతంలో ప్రకటించిన రూ. 1.8 లక్షలకు అదనంగా ఎస్సీ, బీసీలకు రూ. 50 వేలు, ఎస్టీలకు రూ. 70 వేలు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
GNTR: మంగళగిరిలో సోమవారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్ పలు కీలక ప్రకటనలు చేశారు. సుమారు రూ.1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను పేదలకు శాశ్వత నివేశన పట్టాలుగా ఇస్తున్నామన్నారు. రెండేళ్ల తరువాత లబ్ధిదారులకు ఆ భూములను విక్రయించుకునే హక్కు ఉంటుందని చెప్పారు. మంగళగిరిలో 100పడకల ఆసుపత్రికి 13న శంకుస్థాపన చేస్తామన్నారు.
గుంటూరు కొత్తపేటలోని పోస్ట్ ఆఫీస్ రోడ్డు-గౌరీ శంకర్ సినిమా హాల్ వెనుక పారిశుద్ధ్యం పూర్తిగా లోపించిందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. శానిటరీ ఇన్స్పెక్టర్లకు చెత్త తరలించాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఈ ఘటన స్వయానా గుంటూరు నగర ఇన్ఛార్జ్ మేయర్ డివిజన్ కావడం దుర్మార్గమన్నారు.
KDP: వేంపల్లి పట్టణంలోని సంగం వీధికి చెందిన నామ శ్రీనివాసులుకు క్యాన్సర్ వ్యాధి వైద్య నిమిత్తం కోసం రూ. 5లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కును సోమవారం ఎమ్మెల్సీ భూమి రెడ్డి రాంగోపాల్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేయడంతో లబ్ధిదారుల కుటుంబం సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ప్రకాశం: రాచర్ల లోని నెమలిగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ను గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఏప్రిల్ 12 నుంచి 15వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే చెప్పారు.
మేడ్చల్: ఒడిశా రాష్ట్రం నుంచి హర్యానాకు తెలంగాణ మీదుగా తరలిస్తున్న 273 కిలోల డ్రై గంజాయిని శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రింగ్ రోడ్డు సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశామని, ఇద్దరు పరారీలో ఉన్నారని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు.
KRNL: ఆత్మకూరు మండలంలోని కరివేన గ్రామంలో మంగళవారం శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సోమవారం తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన వృషభలకు వరుసగా రూ.30వేలు, రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేలు, రూ.5వేల చొప్పున నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు చెప్పారు.
KNR: పార్లమెంటులో వక్స్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటువేసిన ఎంపీలు హిందువులే కాదని ఆదివారం కరీంనగర్ బీజేపీ అధికార ప్రతినిధి సుధాకర్ అన్నారు. పార్లమెంటులో బిల్లు పాస్ కోసం ఓటు వేసిన వారందరికీ ప్రత్యేక ధన్య వాదాలు తెలిపారు. అలాగే బోర్డుకు వ్యతిరేకంగా ఓటువేసిన వారు అసలు హిందువులే కాదన్నారు. వారిని అనవసరంగా ఎంపీగా గెలిపించకున్నామన్నారు.
YLR: జిల్లాలోని హిందూ యువజన సంఘం(YMHA) హాలులో ఆదివారం సాయంత్రం శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం శ్రీ రామ పరిపాలన చేస్తుందన్నారు.
HYD: తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇంజినీరింగ్పై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎంట్రన్స్ టెస్టులకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జేయియి మెయిన్స్ రెండో సెషన్ పూర్తికావొచ్చింది. TGEAPCET(చివరి తేదీ ఏప్రీల్ 9), APEAPCET ( ఏప్రీల్ 24) ప్రక్రియ కొనసాగుతోంది.
NTR: బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొండపల్లికి చెందిన ఓ బాలిక(5)పై మతిస్థిమితం లేని వ్యక్తి(42) అసభ్యంగా ప్రవర్తించినట్లు బాలిక తల్లి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
W.G: భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో బాబూ జగ్జీవన్రామ్, జ్యోతిరావు పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్సి, ఎస్టి విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్లో కలెక్టర్ చదలవాడ నాగరాణికి వినతి పత్రం అందజేసి మాట్లాడారు. జగ్జీవన్రామ్, అంబేద్కర్, జ్యోతిరావ్ పూలేల జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో ముద్రించాలని కోర...