కామారెడ్డి జిల్లాలో పదో తరగతి పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్టీసీ విద్యార్థులకు అదనపు సౌకర్యాన్ని కల్పించింది. ఏప్రిల్ 7 వరకు జరిగే ఈ పరీక్షల సమయంలో విద్యార్థులు ఎక్కడ చేయి ఎత్తినా బస్సులు ఆపి, వారిని పరీక్షా కేంద్రాల వద్ద దించాలని డ్రైవర్లు, కండక్టర్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
NDL: బేతంచెర్ల మండలం గొర్లగుట్టలో దొరికిన జింక పిల్లను గ్రామస్థులు అటవీ అధికారులకు శుక్రవారం అప్పగించారు. గ్రామానికి చెందిన పార్థసారథి తన పొలంలో జింక పిల్లను గుర్తించాడు. ఆ జింక పిల్లను ఇంటికి తీసుకువచ్చి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. బనగానపల్లె ఫారెస్ట్ రేంజ్ అధికారి మగ్బుల్, బేతంచెర్ల సెక్షన్ అధికారి జయమ్మ జింక పిల్లను స్వీకరించారు.
ELR: జిల్లాలో గృహ వినియోగదారులకు ఎటువంటి వంటగ్యాస్ కొరత లేదని జేసీ అభిషేక్ గౌడ్ తెలిపారు. గ్యాస్ సిలిండర్లను నిరంతరం సరఫరా చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామన్నారు. ఏదైనా సమస్య ఉంటే ASO 8919887013, DCSO 9652892425, 7981222542 నెంబర్లను సంప్రదించాలన్నారు. ఎటువంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ సూచించారు.
NLG: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. శుక్రవారం పట్టణానికి చెందిన పల్స రవికుమార్, పెండెం అంజనేయులకు మంజూరైన స్కూటీలను ఆయన ప్రారంభించి అందజేశారు. దివ్యాంగులు ఆర్థికంగా ఎదిగేందుకు, వారి ప్రయాణ కష్టాలు తీర్చేందుకు ఇలాంటి ఉపకరణాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)లో 5 మెడికల్ ప్రొఫెసనల్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. 3 మెడికల్ ఆఫీసర్, 2 Sr.మెడికల్ ఆఫీసర్ పోస్టులు అందుబాటులో ఉండగా.. MBBS, MD ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గలవారు అర్హులు. రాతపరీక్ష(బెంగళూరులో), ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను తీసుకుంటారు. పోస్టును బట్టి ఏడాదికి రూ.12-15 లక్షల CTC ఉంటుంది.
NRML: సారంగాపూర్ మండలంలోని జామ్ గ్రామంలో గల జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వారే స్వయంగా రకరకాల ఆహార పదార్థాలను తయారు చేసి స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ ఫుడ్ స్టాల్ను సర్పంచ్ కలిపే రవళి విలాస్, ఉప సర్పంచ్ గంగాధర్, ఉపాధ్యాయులు పలువురు సందర్శకులు సందర్శించారు. ఆహార పదార్థాలు రుచి చూశారు.
TPT: నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సీఎం చంద్రబాబు ఇవాళ ఇక్కడికి రావాల్సి ఉంది. అనివార్య కారణాలతో ఆయన పర్యటనను ఈనెల 24వ తేదీకి వాయిదా వేశారని సూళ్లూరుపేట MLA నెలవల విజయశ్రీ చెప్పారు. ఆ రోజున సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్లను అందజేయనున్నారు.
TG: HYDలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న 1.26 లక్షల ఆటోలను దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడంపై దృష్టి సారించింది. ఈ మేరకు ఆటో యజమానులకు రెట్రోఫిట్మెంట్ ఎలక్ట్రిక్ కిట్లు100 శాతం సబ్సిడీతో అందించనుంది. కాగా, ఒక్కో ఆటోకు సుమారు రూ.1.20 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుంది.
అన్నమయ్య: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణలో భాగంగా, శుక్రవారం పుల్లంపేట మండలంలోని పలు గ్రామాల్లో బాలికలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. పుల్లంపేట, కొత్తపేట, అనంతంపల్లి హెల్త్ సెంటర్లలో అర్హులైన బాలికలకు టీకాలు వేశారు. ఈ టీకా ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్ బారి నుంచి రక్షణ పొందవచ్చని అన్నారు. మండలాన్ని క్యాన్సర్ రహితంగా తీర్చిదిద్దుతామని అధికారులు తెలిపారు.
CTR: పూతలపట్టు మండలంలో ఇవాళ ఉదయాన్నే ప్రమాదం జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం బెంగళూరు నుంచి నలుగురు కారులో బయలుదేరారు. పీజీ మిట్టూరు సమీపంలోని బాట గంగమ్మ దేవస్థానం వద్దకు రాగానే కారు అదుపుతప్పింది. డివైడర్ పక్కన కాలువలో బోల్తా కొట్టింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
KMR: మద్నూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 16న ఉపాధి హామీ పథకం సామాజిక ప్రజావేదిక నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 15 వరకు మండలంలోని గ్రామాల్లో జరిగిన సామాజిక తనిఖీ వివరాలపై ఈ వేదికలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకావాలని ఆమె కోరారు.
JN: జిల్లాలో వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని బోర్లు, పైప్లాన్లు, చేతిపంపులను వెంటనే మరమ్మతు చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ప్రజలకు తాగునీటి సమస్యలు ఉంటే వెంటనే స్పందించాలని అధికారులకు తెలిపారు.
KNR: చిగురుమామిడి మండలం నవాబుపేట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం పోచమ్మ బోనాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, గ్రామ వీధుల్లో బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా బయలుదేరి, డబ్బు చప్పుళ్లతో నృత్యాలు చేస్తూ ఆలయానికి చేరుకొని నైవేద్యాలు సమర్పించారు.
ASR: కొయ్యూరు కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకుగాను విద్యార్థులు ధరఖాస్తు చేసుకోవాలని ASO సత్యవతి తెలిపారు. 6వ తరగతిలో 40 సీట్లు, 10వ తరగతిలో 1, ఇంటర్ మొదటి సంవత్సరంలో 40 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులైన విద్యార్థులు ఏప్రిల్ 1వ తేదీలోగా https://apkgbv.apcfss ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
VZM: ద్విచక్ర వాహనం ఢీకొని మహిళా మృతి చెందిన ఘటన కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధి చింతలపాలెం వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. వివరాల ప్రకారం.. శిరిడీ రమణమ్మ కిరాణా దుకాణానికి వస్తుండంగా రోడ్డు దాటే క్రమంలో పెందుర్తి నుంచి కొత్తవలస వస్తున్న ద్విచక్ర వాహన దారుడు బలంగా డీ కొట్టాడు. ఆమె స్టాపర్పై పడడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు.