కోనసీమ: రాజోలు మండలం శివకోడు వైసీపీ సీనియర్ నేత వర్మ తాడేపల్లిలో శుక్రవారం మాజీ సీఎం జగన్తో భేటీ అయ్యురు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారని వర్మ తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతంపై జగన్ పలు సూచనలు చేశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని చెప్పారన్నారు.
ASR: రానున్న 10వ తరగతి రెగ్యులర్, ప్రైవేటు, ఓపెన్ స్కూల్ పరీక్షలు, ఇంటర్మీడియట్ రెగ్యులర్, ఓపెన్ స్కూల్ పరీక్షల్లో విద్యార్ధులందరూ కష్టపడి చదివి పాసవ్వాలని, ఇతర మార్గాలు అన్వేషించ వద్దని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ శుక్రవారం సూచించారు. ఆయా పరీక్షలు అత్యంత పకడ్బందీగా, ఎటువంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా నిర్వహించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.
NZB: డిచ్పల్లి మండలం కోరట్పల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి పండగ శుక్రవారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోనాల ఊరేగింపు చేపట్టగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి పాల్గొన్నారు. పెద్దమ్మ ఆలయంలో ఎమ్మెల్యే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ,ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
KMR: తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే BJP అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ OBC జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ చెప్పారు. MLC ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీజేపీ జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27న జరగనున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు.
కృష్ణ: ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం కింద కేంద్రం ఎంపిక చేసిన ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు లో ప్రత్యేక కార్యాచరణతో అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తుండటంతో మంచి ఫలితాలు వస్తున్నాయని కలెక్టరు లక్ష్మీశ్ అన్నారు. ఇదే స్ఫూర్తితో ఈ రెండు బ్లాక్లను ముందంజలో నిలిచేలా కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం పెనుగంచిప్రోలులో క్షేత్రస్థాయిలో పర్యటించారు.
కృష్ణా: మచిలీపట్నంలోని 10వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ కోస్తా మురళీ సతీమణి పేర్ల వరలక్ష్మి హఠాన్మరణం పట్ల మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వరలక్ష్మి మరణ వార్త తెలుసుకున్న ఆయన హుటాహుటిన విజయవాడ నుంచి మచిలీపట్నం వచ్చారు. వరలక్ష్మి భౌతికకాయాన్ని దర్శించి నివాళులర్పించారు. అనంతరం వరలక్ష్మి పాడె మోసి దహన సంస్కారాల్లో పాల్గొన్నారు.
KDP: పశువైద్య కళాశాల విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి వారి సమ్మెను విరమింపజేయాలని DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్, SFI జిల్లా అధ్యక్షులు ఎద్దు రాహుల్లు తెలిపారు. శుక్రవారం ప్రొద్దుటూరలోని పశు వైద్య కాలేజీలో విద్యార్థులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.
NTR: ఇటీవల కాకినాడలోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నా లాజికల్ యూనివర్సిటీ జరిగిన అంతర్ జిల్లాల తైక్వాండో పోటీలలో వీరులపాడు మండలం పొన్నవరం గ్రామంలోని ఏకత్వా ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు సత్తాచాటారు. 61 కేజీల విభాగంలో కే వర్ధన్ సాయి రజత పతకం, 30 కేజీల విభాగంలో పి. జయ రేణుక, ఎం. లక్ష్మి సహస్ర, వి. యశస్విని కాంశ్య పతకాలు సాధించారు.
NTR: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య రాష్ట్రానికి చేసిన సేవలు ఆదర్శనీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. అయన జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
TG: ప్రధాని మోదీ బీసీ కాదు.. లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 2002 వరకు ఉన్నత వర్గాల్లో మోదీ ఉండేవాళ్లు.. మోదీ సీఎం అయ్యాక ఆయన కులాన్ని బీసీల్లో కలిపారని ఆరోపించారు. మోదీ కులం గురించి ఆషామాషీగా చెప్పడం లేదని, అన్నీ తెలుసుకునే మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. ఇక మీరే ఆలోచించుకోండి అని చెప్పారు.
TPT: ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా కల్లు గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్లు కేటాయించి అమలపరిచిన కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తిరుపతి జిల్లా గౌడ సంక్షేమ సంఘం నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం నూతనంగా గీత కార్మికులకు కేటాయించిన మద్యం దుకాణాన్ని గూడూరు పట్టణం దూడల కాలువసెంటర్లో ఆర్భాటంగా ప్రారంభించారు.
అన్నమయ్య: సీటీఎంలో జరుగుతున్న నల వీర గంగాభవాని జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు మదనపల్లె రెండవ డిపో మేనేజర్ అమర్నాథ్ తెలిపారు. శుక్ర, శనివారాల్లో 15 బస్సులు, ఆదివారం 5 బస్సులు నడుపుతున్నట్లు వివరాలు వెల్లడించారు. భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరారు.
JGL: గత బీఆర్ఎస్ పాలనలో దశాబ్దకాలంగా ఉద్యోగాలు లేక యువకులు ఎంతో నష్టపోయారని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏడాదిలోపే 56 వేల ఉద్యోగాలు కల్పించి యువకులకు మేలు చేసిందని ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాలలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.
PLD: ఎడ్లపాడు మండలం జగ్గాపురం జడ్పీహెచ్ స్కూల్ నందు అంగన్వాడీ కార్యకర్తలకు శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ వెంకటరమణ పాల్గొని పిల్లల కోసం నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను అందించడంపై అవగాహన కల్పించారు. పిల్లలో సమగ్ర అభివృద్ధి కొరకు ప్రీస్కూల్లో సరైన విద్యను అందించడం, పోషకాహార లోపం లేకుండా చేయాలన్నారు.
ATP: యల్లనూరు మండల వ్యాప్తంగా భూమి కలిగిన ప్రతి ఒక్కరూ ప్రత్యేక ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని తప్పకుండా నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ తెలిపారు. ఆ నంబర్ ద్వారానే పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, డ్రిప్ స్పింకర్లు, తదితర సబ్సిడీ పథకాలు కూడా వస్తాయన్నారు. రైతు భరోసా కేంద్రం వద్దకు వెళ్లి ఈ నెలాఖరు లోగా నమోదు చేసుకోవాలని కోరారు.