NDL: బేతంచెర్ల మండలం గొర్లగుట్టలో దొరికిన జింక పిల్లను గ్రామస్థులు అటవీ అధికారులకు శుక్రవారం అప్పగించారు. గ్రామానికి చెందిన పార్థసారథి తన పొలంలో జింక పిల్లను గుర్తించాడు. ఆ జింక పిల్లను ఇంటికి తీసుకువచ్చి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. బనగానపల్లె ఫారెస్ట్ రేంజ్ అధికారి మగ్బుల్, బేతంచెర్ల సెక్షన్ అధికారి జయమ్మ జింక పిల్లను స్వీకరించారు.