ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం జపాన్కు చెందిన ‘కిన్మెమై ప్రీమియం’. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. దీని కిలో ధర సుమారు రూ. 12,500 నుంచి రూ. 15,000 వరకు ఉంటుంది. 5 రకాల మేలైన వంగడాలను కలిపి దీనిని తయారు చేస్తారు. ఈ బియ్యాన్ని కడగాల్సిన అవసరం లేదు. సాధారణ బియ్యం కంటే ఇది 6 రెట్లు ఎక్కువ రోగనిరోధక శక్తిని ఇస్తుంది.