మహిళల హాకీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్ ఫైనల్ మ్యాచ్ ఈరోజు జరగనుంది. జీఎంసీ బాలయోగి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరిగే తుది పోరులో ఇంగ్లండ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. సెమీఫైనల్లో భారత్ 1-0తో ఇటలీని చిత్తు చేసింది. ఈ విజయంతో భారత్ ప్రపంచకప్నకు అర్హత సాధించింది. మరో సెమీఫైనల్లో ఇంగ్లండ్ 2-0తో స్కాట్లాండ్ను ఓడించింది.