MNCL: కోటపల్లి మండలం బబ్బెరచెలుక గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో సోమవారం అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారి మురళీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మూల ప్రదీప్ రెడ్డి, హెచ్ఎం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.