BHPL: జిల్లాలో శనివారం ప్రారంభమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు 99.75 శాతం విద్యార్థులు హాజరైనట్లు DEO రాజేందర్ తెలిపారు. జిల్లాలోని 20 సెంటర్లలో మొత్తం 3,544 మంది విద్యార్థులకు గాను 3,535 మంది పరీక్ష రాశారు. పరీక్షలు శాంతియుతంగా, జాగ్రత్తలతో నిర్వహించబడ్డాయని అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయని తెలిపారు.