WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ పై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాకపోవడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. గత జులై 4, 2025తో జడ్పీటీసీ, ఎంపీటీసీల పదవి కాలం ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు కూడా ఎన్నికల నిర్వహణ పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఆశావాహుల్లో ఆందోళన నెలకొంది.