ATP: అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ తన క్యాంప్ కార్యాలయం నుంచి వివిధ వర్గాల ప్రజలతో సమావేశమయ్యారు. పలు పనుల నిమిత్తం వచ్చిన అధికారులు, పార్టీ నాయకులు, సామాన్య ప్రజలతో ఆయన ముఖాముఖి చర్చించారు. వారి సమస్యలను సావధానంగా విని సానుకూలంగా స్పందించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.