GNTR: వట్టిచెరుకూరు మండలంలో జేసీ అశుతోష్ శ్రీవాస్తవ శనివారం పర్యటించారు. వట్టిచెరుకూరు మండలంలో సర్వే నెం.241లో చెరువుతో పాటు అక్కడ ఉన్న నివాస స్థలాలు కూడా పోరంబోకుగా నమోదై ఉండటం, దానిని గ్రామ కంఠంగా మార్పులు చేయాలని కోరుతూ ప్రజలు కోరడం జరిగింది. ఈ మేరకు వాస్తవ పరిస్థితులను పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులను త్వరితగతిన వారి నివేదికను సమర్పించాలని కోరారు.