ప్రకాశం: వెలిగండ్ల మండలం మరపుగుంట్ల స్వర్ణ గ్రామంలో యు.ఎఫ్.ఎస్ సర్వే, అభివృద్ధి పనులను శుక్రవారం డబ్ల్యూ డిప్యూటీ ఎంపీడీవో ఎస్. రాంప్రసాద్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించి, సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చారు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.