KKD: ముమ్మిడివరానికి చెందిన రాజులపూడి అనిల్ మంగళవారం కాకినాడ నుంచి యానాం వెళ్తుండగా వై జంక్షన్ వద్ద ప్రమాదానికి గురయ్యారు. గుర్తుతెలియని కారు అనిల్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న కోరంగి ఎస్సై సత్యనారాయణ రెడ్డి తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని, బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.