TG: విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటోందని ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వని అసమర్థ ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను సైతం మరిచారన్నారు. హైడ్రా పేరుతో రూ.వేల కోట్ల కుంభకోణం చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని తెలిపారు.