విశాఖ దక్షిణ నియోజకవర్గంలో శనివారం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ 200 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. సీపోర్ట్ CSR భాగంగా అందించిన ఈ మిషన్లతో మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.