BHPL: గణపురం, గొర్లవీడు గ్రామాల్లో మక్కల కొనుగోళు కేంద్రాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.