NLR: వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ విటమిన్-C దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విటమిన్-C ఉపయోగాలు, దాని ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. నిమ్మ, ఆరెంజ్, ఉసిరి వంటి సిట్రస్ జాతి ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.