MLG: వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో ఇవాళ అటవీ శాఖ ఆధ్వర్యంలో అడవి అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సర్పంచ్ వంశావతి-రమేష్ హాజరై, మాట్లాడుతూ.. “అడవిలో నిప్పు.. పర్యావరణానికి ముప్పు.. అడవి సంరక్షణ సమస్త జీవకోటి పరిరక్షణ” అనే నినాదంతో ఈ కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. అటవీ శాఖ అధికారులు, వార్డు మెంబర్లు ఉన్నారు.