TPT: రోడ్డు ప్రమాదంలో సిద్ధార్థ మెడికల్ కళాశాల విద్యార్థి లిఖిత్ సాయి (MBBS) దుర్మరణం చెందారు. శ్రీకాళహస్తికి చెందిన ఆయన గురువారం రాత్రి విజయవాడలోని రామవరప్పాడు నుంచి వస్తుండగా, పరిణయ కళ్యాణ మండపం వద్ద బైక్ అదుపుతప్పి పడిపోయారు. దీంతో తలకు తీవ్ర గాయమవ్వడంతో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణం నిలిచేదని స్థానికులు చెబుతున్నారు.
మారుతి సుజుకి డిజైర్ సరికొత్త రికార్డు సృష్టించింది. 2008లో లాంచ్ అయిన ఈ సెడాన్, ఇప్పటివరకు 30 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని దాటింది. 2025లో 2.14 లక్షల కార్లు అమ్ముడై దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. 4వ తరం మోడల్లో సన్రూఫ్, 360-డిగ్రీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లు ఉండటం దీనికి కలిసి వచ్చింది. లీటరుకు 24.79 కిమీ మైలేజీ ఇవ్వడం దీని ప్రత్యేకత.
TG: యుద్ధం కారణంగా కమర్షియల్ గ్యాస్ కొరత ఏర్పడటంతో హైదరాబాద్ హోటళ్లు, హాస్టళ్లు కట్టెల పొయ్యిల బాట పట్టాయి. గతంలో 10 క్వింటాళ్లు అమ్ముడయ్యే కట్టెలు ఇప్పుడు ఏకంగా 50 క్వింటాళ్లకు చేరాయి. ధర కూడా క్వింటాకు రూ. 1200 నుండి రూ. 2000 వరకు పెరిగింది. గ్యాస్ దొరక్కపోవడంతో నగర వ్యాపారులు కట్టెల మండిల వద్ద బారులు తీరుతున్నారు.
AP: వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మరిన్ని రావాలని సీఎం చంద్రబాబు అన్నారు. రైతులకు ఎప్పటికప్పుడు వాతావరణ వివరాలు చెప్తున్నామని తెలిపారు. ‘నూజివీడు మామిడి, అరకు కాఫీ, గుంటూరు మిరప చాలా ప్రసిద్ధి. ఏలూరు సమీపంలో 500 ఎకరాల్లో కోకో సిటీ తెస్తున్నాం. ఏ పంటలు వేయాలో రైతులు చర్చించుకోవాలి. భూసార పరీక్షలు చేయిస్తున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం’ అని వెల్లడించారు.
కృష్ణా: పెనమలూరు నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడిగా కంకిపాడుకు చెందిన విద్యార్థి నాయకుడు తలారి హరిని టీడీపీ శుక్రవారం నియమించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలపై చురుకుగా పనిచేస్తూ, విద్యార్థుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న హరికి ఈ బాధ్యత అప్పగించినట్లు తెలిపారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని సూచించారు.
PLD: శావల్యాపురం మండలం 11 స్వర్ణ గ్రామాల పరిధిలో ఈ నెల 15న నిర్వహిస్తున్న అక్షరాంధ్ర పరీక్షలను సిబ్బంది సజావుగా నిర్వహించాలని వయోజన విద్య సూపర్వైజర్ నాగేశ్వరరావు తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో వీవోఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, స్వర్ణ గ్రామాల సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించి పరీక్షా సామాగ్రిని పంపిణీ చేశారు.
NTR: జిల్లాను రహదారి భద్రతలో నెం.1గా నిలబెట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సూచించారు. కలెక్టరేట్లో జరిగిన జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 123 బ్లాక్స్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించి ప్రమాదాలను తగ్గించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంచాలని తెలిపారు.
AP: భూగర్భ జలాలు పెంచాలని సీఎం చంద్రబాబు అన్నారు. చివరి భూములకూ నీళ్లు ఇవ్వాలని తెలిపారు. ‘గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తాం. ఉపన్యాసాలు ఇచ్చి వెళ్లిపోతే.. పనులు పూర్తి కావు. రైతుల ఇళ్ల వద్దకు వెళ్తాం.. పంటలపై అవగాహన కల్పిస్తాం. ఇప్పుడు అన్నం తినేవారు తగ్గిపోతున్నారు.. డిమాండ్ ఆధారిత పంటలు వేసేలా రైతులను ప్రోత్సహిస్తాం’ అని వెల్లడించారు.
వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు బలహీనపడి ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రావడం సహజం. కానీ సరైన జాగ్రత్తలతో వీటిని అరికట్టవచ్చు. ఎముకలు బలంగా ఉండాలంటే శరీరానికి విటమిన్-డి, కాల్షియం ఎంతో అవసరం. ప్రతిరోజూ ఉదయం కాసేపు ఎండలో ఉండటం ద్వారా విటమిన్-D లభిస్తుంది. అలాగే పాలు, పెరుగు, రాగులు, ఆకుకూరల ద్వారా శరీరానికి తగినంత కాల్షియం అందుతుంది. వీటితో ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉండవచ్చు.
AP: ఆక్వా కల్చర్ రైతులకు రాయితీ కింద రూ.810 కోట్లు ఇచ్చామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇచ్చామన్నారు. డిజిటల్ క్రాప్ సర్వే చేయిస్తున్నా. చెరువులు బాగు చేసి.. నీరు నింపేలా చర్యలు తీసుకున్నాం. ఖరీఫ్, రబీకి వాడుకున్నా ఇంకా చెరువుల్లో నీళ్లు ఉన్నాయి. మేం చేపట్టిన చర్యలతో భూగర్భ జలాలు పెరిగాయి. నీటి భద్రత ఇచ్చే బాధ్యత సాగునీటి సంఘాలదే’ అని చెప్పారు.
RR: చందానగర్ డివిజన్ పరిధిలోని భవానిపురం వీకర్ సెక్షన్ బస్తీ (మజీద్ ఏ గౌసియా), వేముకుంట బస్తీ (మొహమ్మదీయా మజీద్)లలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మైనారిటీలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
AP: ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. మామిడి రైతులకు కూడా గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకున్నామని తెలిపారు. ‘పొగాకు, కోకో, ఉల్లి, టమాటా రైతులను ఆదుకున్నాం. ఇప్పటివరకు రూ.1,338 కోట్లు ఇచ్చి రైతులను ఆదుకున్నాం. రాష్ట్రాభివృద్ధిలో రైతులది కీలక పాత్ర. వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీ వాడేలా ప్రోత్సహిస్తున్నాం’ అని వెల్లడించారు.
TG: నదీ పరివాహక ప్రాంతంలో ఎకనమిక్ జోన్ తయారుచేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ నగరంలోని చెరువులు పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. చెరువులు పునరుద్ధరిస్తున్నందుకు ప్రజలు తమకు ఘనస్వాగతం పలుకుతున్నారని వ్యాఖ్యానించారు. నీళ్లు ప్రవహించే ప్రాంతాలను మనం ఆక్రమించుకోవడం వల్ల వరదలొస్తున్నాయన్నారు.
AP: తుళ్లూరు-తాడికొండ రోడ్డును మంత్రి నారాయణ పరిశీలించారు. ఆ రోడ్డు బాగా దెబ్బతిందని ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. రాజధానిలో పనుల వల్ల భారీ వాహనాలు వెళ్తున్నాయని.. దీంతో రోడ్లు దెబ్బతింటున్నాయని చెప్పారు. రాజధానిలో రోడ్లు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ వెల్లడించారు. విజయవాడ, గుంటూరు నుంచి అమరావతికి కనెక్టివిటీ పెంచుతున్నామని తెలిపారు.
తిరుపతి శ్రీ వేశాలమ్మ ఆలయంలో నూతన పాలకమండలి ప్రమాణస్వీకారోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని నాయకులతో కలిసి నూతన ఛైర్మన్, సభ్యులను అభినందించారు. కార్యక్రమానికి ముందు ఆయన వేశాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ఆలయ మర్యాదలతో సత్కారం స్వీకరించారు.