తిరుపతి శ్రీ వేశాలమ్మ ఆలయంలో నూతన పాలకమండలి ప్రమాణస్వీకారోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని నాయకులతో కలిసి నూతన ఛైర్మన్, సభ్యులను అభినందించారు. కార్యక్రమానికి ముందు ఆయన వేశాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ఆలయ మర్యాదలతో సత్కారం స్వీకరించారు.