CTR: పూతలపట్టులో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 9మందిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ గోపి తెలిపారు. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్నట్లు తమకు సమాచారం రావడంతో మెరుపు దాడి చేసి 9 మందికి బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ చేసి వారి అడ్రస్లు నమోదు చేసుకున్నట్లు చెప్పారు. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.