NLR: కందుకూరు MLA నాగేశ్వరరావుపై పట్టణానికి చెందిన మాదాల నరసింగరావు సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నట్లు కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పట్టణ ఎస్సై పులి శివ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రచారం వల్ల శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశం ఉందని తెలిపారు. నిరాధార ఆరోపణలు చేసి పరువు నష్టం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.