VSP: విశాఖలోని 10వ వార్డు కార్యాలయంలో వైసీపీ బూత్ లెవల్ ఏజెంట్లు, ముఖ్య నాయకులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి పాల్గొని కమిటీల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్డు వెరిఫికేషన్ పూర్తి చేసిన వారికి త్వరలోనే కార్డులు అందుతాయని తెలిపారు.