AP: వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మరిన్ని రావాలని సీఎం చంద్రబాబు అన్నారు. రైతులకు ఎప్పటికప్పుడు వాతావరణ వివరాలు చెప్తున్నామని తెలిపారు. ‘నూజివీడు మామిడి, అరకు కాఫీ, గుంటూరు మిరప చాలా ప్రసిద్ధి. ఏలూరు సమీపంలో 500 ఎకరాల్లో కోకో సిటీ తెస్తున్నాం. ఏ పంటలు వేయాలో రైతులు చర్చించుకోవాలి. భూసార పరీక్షలు చేయిస్తున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం’ అని వెల్లడించారు.