గుంటూరు కొత్తపేటలోని పోస్ట్ ఆఫీస్ రోడ్డు-గౌరీ శంకర్ సినిమా హాల్ వెనుక పారిశుద్ధ్యం పూర్తిగా లోపించిందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. శానిటరీ ఇన్స్పెక్టర్లకు చెత్త తరలించాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఈ ఘటన స్వయానా గుంటూరు నగర ఇన్ఛార్జ్ మేయర్ డివిజన్ కావడం దుర్మార్గమన్నారు.
KDP: వేంపల్లి పట్టణంలోని సంగం వీధికి చెందిన నామ శ్రీనివాసులుకు క్యాన్సర్ వ్యాధి వైద్య నిమిత్తం కోసం రూ. 5లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కును సోమవారం ఎమ్మెల్సీ భూమి రెడ్డి రాంగోపాల్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేయడంతో లబ్ధిదారుల కుటుంబం సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ప్రకాశం: రాచర్ల లోని నెమలిగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ను గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఏప్రిల్ 12 నుంచి 15వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే చెప్పారు.
మేడ్చల్: ఒడిశా రాష్ట్రం నుంచి హర్యానాకు తెలంగాణ మీదుగా తరలిస్తున్న 273 కిలోల డ్రై గంజాయిని శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రింగ్ రోడ్డు సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశామని, ఇద్దరు పరారీలో ఉన్నారని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు.
KRNL: ఆత్మకూరు మండలంలోని కరివేన గ్రామంలో మంగళవారం శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సోమవారం తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన వృషభలకు వరుసగా రూ.30వేలు, రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేలు, రూ.5వేల చొప్పున నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు చెప్పారు.
KNR: పార్లమెంటులో వక్స్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటువేసిన ఎంపీలు హిందువులే కాదని ఆదివారం కరీంనగర్ బీజేపీ అధికార ప్రతినిధి సుధాకర్ అన్నారు. పార్లమెంటులో బిల్లు పాస్ కోసం ఓటు వేసిన వారందరికీ ప్రత్యేక ధన్య వాదాలు తెలిపారు. అలాగే బోర్డుకు వ్యతిరేకంగా ఓటువేసిన వారు అసలు హిందువులే కాదన్నారు. వారిని అనవసరంగా ఎంపీగా గెలిపించకున్నామన్నారు.
YLR: జిల్లాలోని హిందూ యువజన సంఘం(YMHA) హాలులో ఆదివారం సాయంత్రం శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం శ్రీ రామ పరిపాలన చేస్తుందన్నారు.
HYD: తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇంజినీరింగ్పై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎంట్రన్స్ టెస్టులకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జేయియి మెయిన్స్ రెండో సెషన్ పూర్తికావొచ్చింది. TGEAPCET(చివరి తేదీ ఏప్రీల్ 9), APEAPCET ( ఏప్రీల్ 24) ప్రక్రియ కొనసాగుతోంది.
NTR: బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొండపల్లికి చెందిన ఓ బాలిక(5)పై మతిస్థిమితం లేని వ్యక్తి(42) అసభ్యంగా ప్రవర్తించినట్లు బాలిక తల్లి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
W.G: భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో బాబూ జగ్జీవన్రామ్, జ్యోతిరావు పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్సి, ఎస్టి విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్లో కలెక్టర్ చదలవాడ నాగరాణికి వినతి పత్రం అందజేసి మాట్లాడారు. జగ్జీవన్రామ్, అంబేద్కర్, జ్యోతిరావ్ పూలేల జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో ముద్రించాలని కోర...
PPM: కురుపాం మండలం తిత్తిరి పంచాయతీ దొంపలపాడులో నివసిస్తున్న ఊలక సుమన్ గత రెండు నెలలుగా రేషన్ బియ్యం ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆయన మాట్లాడుతూ.. రెండు నెలలుగా తమ తెల్ల రేషన్ కార్డుకు నిత్యవసర సరుకులు ఇవ్వట్లేదని వాపోతున్నాడు. డీలర్ను సంప్రదిస్తే ఎమ్మార్వో ఆఫీసు సంప్రదించాలన్నారని ఆఫీసుకు వెళ్లి సమస్యను వివరించామన్నారు.
KMR: సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామంలో నెల రోజులుగా తాగునీటి కొరతతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు వినతులు పెట్టినా స్పందన లేకపోవడంతో గ్రామస్థులు ప్రతి ఇంటి నుంచి రూ.500 చొప్పున సొంతంగా చందాలు వసూలు చేసి ఆదివారం కొత్త బోరు వేసుకున్నారు. దీని కోసం సుమారు రూ.2.5 లక్షలు ఖర్చు చేశారు.
అన్నమయ్య: వైసీపీ మదనపల్లె ముస్లిం ఐక్యవేదిక పట్టణ అధ్యక్షుడిగా షేక్ గుండ్లూర్ మహమ్మద్ ఫయాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన ఎంపీ మిథున్ రెడ్డి, ఇంఛార్జ్ నిస్సార్ అహ్మద్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అధికార ప్రభుత్వంలో ముస్లింలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడుతానని స్పష్టం చేశారు.
JGL: రాయికల్ పట్టణానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యు డు కైరం పురుషోత్తం గౌడ్ అనారోగ్యంతో మృతి చెందాడు. గత కొన్ని రోజుల నుంచి ముంబాయిలో ఉంటున్న పురుషోత్తం గౌడ్ ఆదివారం ఉదయం మృతి చెందగా.. రాత్రి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. దీంతో అంత్యక్రియలు నిర్వహించారు. పురుషోత్తం గౌడ్ మృతికి పలు పార్టీల నాయకులు, గ్రామస్తులు సంతాపం తెలిపారు.