• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

విలువలకి రూపం దామోదరం సంజీవయ్య

SKLM: విలువలకి రూపం దామోదరం సంజీవయ్య అని దళిత సంఘాల నేతలు కొనియాడారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలో దామోదరం సంజీవయ్య పార్క్‌లో ఉన్న ఆయన విగ్రహానికి వారంతా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ.. దళిత సీఎంగా ఆయన చేసిన సేవలు నేటి యువతకి స్ఫూర్తిదాయకమ అన్నారు.

February 14, 2025 / 04:58 PM IST

అభివృద్ధిపై ఎమ్మెల్యే, ఎంపీల చర్చలు

CTR: పార్లమెంటు కార్యాలయంలో చిత్తూరు పార్లమెంటు సభ్యుడు దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు చిత్తూరు అభివృద్ధిపై చర్చించుకున్నారు. ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఉద్ఘాటించారు.

February 14, 2025 / 04:57 PM IST

గుంటూరులో పర్యటించిన క్రికెటర్ రషీద్

GNTR: భారత క్రికెట్ యువ క్రీడాకారుడు అబ్దుల్ రషీద్ శుక్రవారం గుంటూరులో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక సుప్రసిద్ధ హజరత్ సయ్యద్ బాజీ షహిద్ అవులియా వారి దర్గాకు విచ్చేసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు రషీద్ తో ఫోటోలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. రషీద్ ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగుతూ సంతోషం వ్యక్తం చేశారు.

February 14, 2025 / 04:38 PM IST

రాకేష్ మరణం బాధించింది: లోకేష్

GNTR: ఏనుగుల దాడిలో మృతి చెందిన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లె ఉపసర్పంచ్ రాకేష్ కుటుంబ సభ్యులు ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ ను కలిశారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండే రాకేష్ మృతి చెందడం నన్ను కలచి వేసిందని లోకేష్ అన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని, ఏనుగుల దాడిచేయడంతో ఆయన మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.

February 14, 2025 / 04:34 PM IST

ఎంపీ లక్ష్మణ్‌ను కలిసిన కామారెడ్డి న్యాయవాదులు

KMR: కామారెడ్డిలో ఓ కార్యక్రమానికి హాజరైన రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. లక్ష్మణ్‌ను కామారెడ్డికి చెందిన న్యాయవాదులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర రాజకీయ అంశాలపై చర్చించామని, దేశంలో ఓబీసీల ఉన్నతికి మరింత కృషి చేయాలని కోరామన్నారు.

February 14, 2025 / 04:33 PM IST

డ్రగ్స్ ఫ్రీ ఏపీ‌పై విద్యార్ధులకు అవగాహన

ASR: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో సెన్సిటైజేషన్ క్లాసులను నిర్వహించారు. డ్రగ్స్ వలన కలిగే అనర్ధాలను ప్రిన్సిపాల్ డా.నాయక్ విద్యార్ధులకు వివరించారు. సెన్సిటైజేషన్ క్లాసుల ఉద్దేశాలను, డ్రగ్స్‌కు వ్యతిరేక చట్టాల గురించి డ్రగ్ ఫ్రీ ఏపీ యూనిట్ నోడల్ అధికారి, NSS PO అనిత కుమారి వివరించారు.

February 14, 2025 / 04:27 PM IST

కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన రామ్మోహన్ నాయుడు

SKLM: కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో శుక్రవారం శ్రీకాకుళం ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో రైల్వేల అభివృద్ధి పనుల గురించి చర్చించినట్లు సోషల్ మీడియా వేదిక ద్వారా తెలిపారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

February 14, 2025 / 04:20 PM IST

గాజువాకలో రోడ్డు ప్రమాదం.. మృతుని వివరాలు ఇవే

VSP: పాత గాజువాక రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సీతమ్మధార ప్రాంతానికి చెందిన లక్ష్మణ్, మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన రమణ కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కాంక్రీట్ వాహనం ఢీకొట్టింది. లక్ష్మణ్ అక్కడికక్కడే మృతిచెందగా.. రమణ తీవ్రంగా గాయపడ్డాడు. కాంక్రీట్ వెహికల్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

February 14, 2025 / 04:03 PM IST

బహుళ బీడీ కార్మికుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జగదీశ్వర్

NZB: తెలంగాణ రాష్ట్ర బహుళ బీడీ కార్మికుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బ్రాహ్మణపల్లి జగదీశ్వర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బాల్కొండ ప్రాంతానికి చెందిన వ్యక్తి HYDలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎన్నికయ్యారు. బాల్కొండ ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఎన్నుకోవడంపై కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.

February 14, 2025 / 03:12 PM IST

క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలి: ఎంపీ

KMM: ముదిగొండ సమీపంలో జరిగిన గ్రానైట్ రాళ్ల లారీ బోల్తా ప్రమాద ఘటన మృతులకు ఎంపీ రఘురాం రెడ్డి సంతాపం తెలిపారు. ఖమ్మం కైకొండాయిగూడెంకు చెందిన వీరన్న, హుస్సేన్ ఈ ప్రమాదంలో మరణించడం బాధాకరమని, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఫోన్ చేసి మెరుగైన చికిత్స అందించాలని ఎంపీ ఆదేశించారు.

February 14, 2025 / 03:12 PM IST

‘రైతు మహా ధర్నాను విజయవంతం చేయాలి’

KMM: మిర్చి క్వింటాకు రూ. 25వేలు ధర నిర్ణయించి నాఫెడ్, మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18న  నిర్వహిస్తున్న రైతుల మహా ధర్నా జయప్రదం చేయాలని తెలంగాణ రైతు ఖసంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబుకోరారు. ఈ మేరకు  శుక్రవారం కామేపల్లి మండలంలో సంఘం ఆధ్వర్యంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. మహా ధర్నాలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.

February 14, 2025 / 03:06 PM IST

బ్యాంకర్లకు మంత్రి తుమ్మల చురకలు

TG: కొడకండ్లలో రైతు ఇంటి గేటు తీసుకెళ్లడాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా తప్పుబట్టారు. వేల కోట్లు అప్పు తీసుకున్న వారిని ఏం చేస్తున్నారని.. బ్యాంకులు వారి దగ్గర నుంచి ఎందుకు రికవరీ చేయడం లేదని? ప్రశ్నించారు. బ్యాంకింగ్ రంగం వ్యవసాయంపై దృష్టి పెట్టాలని.. రైతులను గౌరవించాలని సూచించారు. రైతులంటే అడుక్కునే వారు, బ్యాంకులంటే ఇచ్చే వారు అనే భావన వద్దని చెప్పారు.

February 14, 2025 / 02:26 PM IST

బెంగళూరుకు యాసిడ్ దాడి బాధితురాలు

AP: అన్నమయ్య జిల్లా యాసిడ్ దాడి ఘటన యువతిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. గుర్రంకొండ ప్యారంపల్లెలో యువతిని కత్తితో పొడిచి ముఖంపై గణేష్ అనే యువకుడు యాసిడ్ పోసిన విషయం తెలిసిందే. గణేష్ మదనపల్లెలోని అమ్మచెరువు మిట్టకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఏప్రిల్ 29న యువతి పెళ్లి జరగనున్న నేపథ్యంలో ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

February 14, 2025 / 02:23 PM IST

ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆర్‌డీవో

CTR: పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలో ఆర్టీవో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాఠశాలల్లోని మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం, రికార్డులను చూశారు. ఈ సందర్భంగా ఆర్టీవో భవాని మాట్లాడుతూ పాఠశాలల్లో, అంగన్వాడీలలో మౌలిక వసతులు తదితర అంశాలపై ఉపాధ్యాయులను, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో చంద్రశేఖర్ రెడ్డి, ICDS రాజేశ్వరి, రెవిన్యూ సిబంది పాల్గొన్నారు.

February 14, 2025 / 02:22 PM IST

పెద్దపల్లి స్వచ్ఛతే నా లక్ష్యం: కమిషనర్

PDPL: పెద్దపల్లి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడమే తన లక్ష్యమని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని 31వ వార్డులో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు కూడా సహకరించి భాగస్వామ్యం కావాలన్నారు.

February 14, 2025 / 01:53 PM IST