• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

విశాఖ మార్కెట్‌లో కూరగాయల ధరలు..

విశాఖ 13 రైతు బజార్లలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు సోమవారం కాయగూరల ధరలను విడుదల చేశారు.(రూ. కిలో)టమాట రూ.17, ఉల్లిపాయలు రూ.22, బంగాళా దుంపలు రూ.17, బెండకాయలు రూ. 28, కాకరకాయలు రూ.34, క్యారెట్ రూ.32/34, మునగ కాడలు రూ.24, అల్లం రూ.48, బరబాటి రూ.30, బీట్రూట్ రూ.24, బీన్స్ రూ.50, పాటల్స్ రూ.64, చామ రూ.26, దేవుడు చిక్కుడు రూ.60లుగా ధరల నిర్ణయించారు.

April 7, 2025 / 07:56 AM IST

జగజ్జీవన్‌, పూలే విగ్రహాలు ఏర్పాటు చేయాలి

W.G: భీమవరం ప్రకాశం చౌక్‌ సెంటర్లో బాబూ జగ్జీవన్‌రామ్‌, జ్యోతిరావు పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్‌సి, ఎస్‌టి విజిలెన్స్‌ మోనిటరింగ్‌ కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్లో కలెక్టర్‌ చదలవాడ నాగరాణికి వినతి పత్రం అందజేసి మాట్లాడారు. జగ్జీవన్‌రామ్‌, అంబేద్కర్‌, జ్యోతిరావ్‌ పూలేల జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో ముద్రించాలని కోర...

April 7, 2025 / 07:55 AM IST

రేషన్‌ను ఇప్పించండి సార్

PPM: కురుపాం మండలం తిత్తిరి పంచాయతీ దొంపలపాడులో నివసిస్తున్న ఊలక సుమన్ గత రెండు నెలలుగా రేషన్ బియ్యం ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆయన మాట్లాడుతూ.. రెండు నెలలుగా తమ తెల్ల రేషన్ కార్డుకు నిత్యవసర సరుకులు ఇవ్వట్లేదని వాపోతున్నాడు. డీలర్‌ను సంప్రదిస్తే ఎమ్మార్వో ఆఫీసు సంప్రదించాలన్నారని ఆఫీసుకు వెళ్లి సమస్యను వివరించామన్నారు.

April 7, 2025 / 07:51 AM IST

సొంత డబ్బులతో బోరు వేసుకున్న గ్రామస్థులు

KMR: సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామంలో నెల రోజులుగా తాగునీటి కొరతతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు వినతులు పెట్టినా స్పందన లేకపోవడంతో గ్రామస్థులు ప్రతి ఇంటి నుంచి రూ.500 చొప్పున సొంతంగా చందాలు వసూలు చేసి ఆదివారం కొత్త బోరు వేసుకున్నారు. దీని కోసం సుమారు రూ.2.5 లక్షలు ఖర్చు చేశారు.

April 7, 2025 / 07:45 AM IST

ముస్లిం ఐక్యవేదిక పట్టణ అధ్యక్షుడిగా ఫయాజ్

అన్నమయ్య: వైసీపీ మదనపల్లె ముస్లిం ఐక్యవేదిక పట్టణ అధ్యక్షుడిగా షేక్ గుండ్లూర్ మహమ్మద్ ఫయాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన ఎంపీ మిథున్ రెడ్డి, ఇంఛార్జ్ నిస్సార్ అహ్మద్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అధికార ప్రభుత్వంలో ముస్లింలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడుతానని స్పష్టం చేశారు.

April 7, 2025 / 07:35 AM IST

అనారోగ్యంతో మాజీ ఎంపీటీసీ సభ్యుడు మృతి

JGL: రాయికల్ పట్టణానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యు డు కైరం పురుషోత్తం గౌడ్ అనారోగ్యంతో మృతి చెందాడు. గత కొన్ని రోజుల నుంచి ముంబాయిలో ఉంటున్న పురుషోత్తం గౌడ్ ఆదివారం ఉదయం మృతి చెందగా.. రాత్రి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. దీంతో అంత్యక్రియలు నిర్వహించారు. పురుషోత్తం గౌడ్ మృతికి పలు పార్టీల నాయకులు, గ్రామస్తులు సంతాపం తెలిపారు.

April 7, 2025 / 07:30 AM IST

కోటపాడు గ్రామంలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

NDL: కోటపాడు గ్రామంలో బీటెక్ విద్యార్థిని వైష్ణవి రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పేడలో పసుపు రంగు నీళ్లు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వైష్ణవి కర్నూలు పట్టణంలో బీటెక్ సెకండియర్ చదువుతున్నది. పరీక్షల్లో ఫెయిల్ అయితే తల్లిదండ్రులు మందలిస్తారనే భయంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తండ్రి విక్రమ్ పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

April 7, 2025 / 07:26 AM IST

జిల్లా ఇంఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటన రద్దు

అన్నమయ్య: జిల్లా ఇంఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటన రద్దు అయినట్లు కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8, 9 తేదీల్లో జిల్లాలో పర్యటించాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల రద్దయింది. దీంతో నియోజకవర్గాల్లో మార్కెట్ చైర్మన్‌ల నియామకాలు కొలిక్కి వస్తుందన్న ఆశావాహులకు మళ్లీ నిరాశే ఎదురైంది.

April 7, 2025 / 07:08 AM IST

మద్దతు ధరపై ధాన్యం కొనుగోలుచేయాలి : రామకృష్ణ

NTR: రబీలో పండిన ధాన్యాన్ని మద్దతు ధర ప్రకారం వెంటనే కొనుగోలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలులో ఆయన పర్యటించారు. రైతులతో మాట్లాడి ధాన్యం అమ్ముకోవడంలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రబీలో ధాన్యానికి మద్దతు ధర దక్కడంలేదని రైతులు వాపోయారు.

April 7, 2025 / 06:47 AM IST

ఖమ్మంలో పల్లకీ మోసిన ఎంపీ వద్దిరాజు

KMM: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఖమ్మంలోని తన నివాసానికి సమీపాన ఉన్న శ్రీఆంజనేయ స్వామి ఆలయాన్ని ఆదివారం సాయంత్రం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర కొబ్బరికాయ కొట్టి తన గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేసి పూజారి నుంచి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆశీర్వచనాలు అందుకున్నారు.

April 7, 2025 / 05:20 AM IST

ఫుడ్ పాయిజన్‌తో మహిళా మృతి

SRCL: ఫుడ్ పాయిజన్‌తో ఓ మహిళ ఆదివారం మృతి చెందింది. రుద్రంగికి చెందిన కాదాసు పుష్పలత (35), ఆమె కుమారుడు నిహాల్ (6) శుక్రవారం రాత్రి ఇంట్లో చపాతీలు తిని పడుకున్నారు. రాత్రి ఇద్దరికీ వాంతులు, విరోచనాలు అయ్యాయి. వారిని కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పుష్పలత పరిస్థితి విషమించి మరణించింది.

April 7, 2025 / 04:04 AM IST

రేపటి పీజీఆర్ఎస్ రద్దు

ASR: ఎంపీడీవో ఆఫీసులో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారంన రద్దు చేసినట్లు ఆదివారం అరకులోయ ఎంపీడీవో లవరాజు తెలిపారు. రేపు సోమవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరకులోయ పర్యటన కారణంగా రేపు జరగవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను రద్దు చేయడం జరిగిందని ఎంపీడీవో పేర్కొన్నారు. కావున ప్రజలు గమనించగలరని కోరారు.

April 6, 2025 / 08:21 PM IST

రేపు మెగా రక్తదాన శిబిరాన్ని

HNK: కాజీపేట మండల కేంద్రంలోని వడ్డేపల్లి ట్యాంక్ బండ్‌పై రేపు ఉదయం 8 గంటలకు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగు మెగా రక్తదాన శిబిరాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించనున్నారు. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 100 యూనిట్ల రక్తం సేకరణ లక్ష్యంగా జరుగుతున్న వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.

April 6, 2025 / 07:58 PM IST

‘స్మార్ట్ మీటర్లు బిగిస్తే అడ్డుకుంటాం’

NDL: ఇండ్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగిస్తే అడ్డుకుంటామని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగేశ్వరరావు హెచ్చరించారు. ఆదివారం నందికోట్కూరు మున్సిపాలిటీ వాల్మీకి నగర్‌లో విద్యుత్ స్మార్ట్ మీటర్ల స్టిక్కర్ విడుదల చేసి, ఇండ్లకు అతికించడం జరిగింది. జగన్ చేసిన తప్పిదాలను కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లుతుందన్నారు.

April 6, 2025 / 07:58 PM IST

ప్రసాద్ బాబును పరామర్శించిన డాక్టర్ రాజయ్య

JN: స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ కేంద్రంలో గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కూడా ఛైర్మన్ గట్టు ప్రసాద్ బాబు గౌడ్‌ను నేడు మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాడికొండ రాజయ్య పరామర్శించారు. ప్రసాద్ బాబు అస్వస్థతో బాధపడుతున్నట్లుగా తెలుసుకున్న రాజయ్య బీఆర్ఎస్ నాయకులతో కలిసి వెళ్లి భరోసా కల్పించారు.

April 6, 2025 / 07:39 PM IST