ప్రముఖ నటుడు, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి రవీంద్రన్ నరసింహన్ చనిపోయారు. ఈ విషయాన్ని తెలుపుతూ రాహుల్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అలాగే తన మామయ్య చనిపోయారని సింగర్ చిన్మయి వెల్లడించారు.
సత్యసాయి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు రేపు ఉదయం 10 గంటలకు లేపాక్షి మండల MRO కార్యాలయంలో భూ సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మండల ప్రజలు హాజరై తమ భూ సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా మండల కన్వీనర్ E. జయప్ప కోరారు.
బంగారం కొనాలంటేనే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. గత నెలలో తులం బంగారం రూ.80వేలు దాటినప్పటి నుంచి రూ.లక్షకు చేరుతుందేమోనని అనుకుంటున్నారు. నిన్న తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ. 87,500 ఉండగా ఇవాళ రూ.110 పెరిగి రూ. 87,610కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ. 79,800 ఉండగా.. నేడు రూ.100 పెరిగి రూ. 79,900కు చేరింది.
SKLM: పోలాకి మండలం రాళ్లపాడు కాలనీలో ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ 12వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆయనతోపాటు ఎంపీపీ ముద్దాడ బైరాగి నాయుడు, మండల అధ్యక్షులు కణితి కృష్ణారావు, తదితరులు ఉన్నారు.
కోనసీమ: అల్లవరం మండలం మొగళ్లమూరు గ్రామంలో శ్రీ లక్ష్మీగణపతి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సతీమణి చింతా అనురాధ పాల్గొని, స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమెను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.
HYD: చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రధాన ఆలయ అర్చకులు రంగరాజన్ పై దాడి విషయం తెలుసుకున్న అఘోరి నాగసాధు ఆయనని శక్రవారం కలిశారు. రంగరాజన్ను పరామర్శించి అనంతరం దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. దైవ సేవలో నిమగ్నమయ్యే అర్చకుడిపై దాడి చేయడం దురదృష్టకరమన్నారు. ధర్మం కోసం పోరాడే వ్యక్తిపై దాడి చెయ్యడం సరైంది కాదన్నారు.
NLG: ఉద్యోగం చేస్తూ వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. ఖండాలు వేరైనా ఒకరినొకరు ఇష్టపడ్డారు. నల్లొండ జిల్లా దాచారం గ్రామానికి చెందిన సందీప్ ఉన్నత చదువుల కోసం పదేళ్లక్రితం అమెరికాకు వెళ్లాడు. అక్కడ కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ పూర్తి చేసి టెక్సాస్లో సాఫ్ట్ వేరు ఇంజనీర్గా పని చేస్తున్నాడు.
KNR: RRB, SSC, BANKING ఉచిత శిక్షణ తరగతులు ఈ నెల 15 నుంచి ప్రారంభం అవుతాయని కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ఎంపిక అయిన అభ్యర్థులకు ఈ నెల 14 వరకు ధ్రువపత్రాల పరిశీలన ముగుస్తుందని తెలిపారు. బయోమెట్రిక్ అటెండెన్స్ అమలవుతుందని అన్నారు.
NZB: కుంభమేళాకువెళ్లివస్తూ రైలులో మహిళ మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సైసాయిరెడ్డి తెలిపారు. జైపూర్-హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ రైళ్లోని S5 కోచ్లో తోటి భక్తులతో ప్రయాణిస్తున్న అనిత అనారోగ్యంతో మృతి చెందిందన్నారు. మృతురాలిది కర్ణాటకలోని బీదర్ జిల్లా మిర్జాపూర్ గ్రామమని ఎస్సై వివరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని NZB GGH మార్చురీకి తరలించామని చెప్పారు.
కృష్ణా: పామర్రు టౌన్ గుడివాడ రోడ్డులో ఉన్న ఓ చికెన్ సెంటర్లో తెల్లవారుజామున దొంగతనం జరిగిందని షాప్ యజమాని తెలిపాడు. ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం ఉదయం షాప్ వద్దకు వచ్చి చూసేసరికి గేట్కు వేసి ఉన్న తాళాలు బద్దలుకొట్టి ఉన్నాయని, అలాగే షాప్లో ముఖ్యమైన వస్తువులు దొంగిలించబడ్డాయని చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
కృష్ణా: కూటమి ప్రభుత్వం పేదల వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శుక్రవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో 21మందికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.18,86,311లను సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధిదారులకు అందజేశారు. కూటమి ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ సహాయం వేగవంతంగా అందిస్తున్న చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
NTR: గంపలగూడెం మండలం అనుముల లంకలో ఉన్న పౌల్ట్రీ ఫారంలో వేలకొద్ది కోళ్లు బర్డ్ ఫ్లూతో మృత్యువాత పడ్డ విషయం విధితమే. ఈ నేపథ్యంలో జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ హనుమంతరావు పర్యవేక్షణలో కోళ్ల శాంపిల్స్ తీసి పరీక్షా కేంద్రానికి పంపారు. రిజల్ట్ వచ్చేంతవరకు 10 కిలోమీటర్ల లోపల ఉన్న గ్రామాలలో చికెన్ షాపులు తెరవద్దని,రెడ్ అలర్ట్ ప్రకటించారు.
నల్గొండ: మిర్యాలగూడ పట్టణంలోని MVR ఫంక్షన్ హాల్ నందు గుడిపాటి నవీన్ ఆధ్వర్యంలో మహా చండీ యాగం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాధవి హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకులు, BLR బ్రదర్స్, తదితరులు పాల్గొన్నారు.
HYD: గత కొన్ని రోజులుగా కోళ్లకు వస్తున్న బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ తినొద్దంటూ ప్రభుత్వం చెబుతుంటే మరోపక్క పాడైపోయిన చికెన్ అమ్మేస్తున్నారు. తాజాగా సికింద్రాబాద్ పరిధిలోని ఓ చికెన్ దుకాణంలో 2 క్వింటాళ్ల వరకు పాడైపోయిన చికెన్ను అధికారులు గుర్తించారు. ఈ చికెన్ను అమ్మడానికి ప్రయత్నిస్తున్న దుకాణదారుడు పై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మేడ్చల్: కాప్రా ఓల్డ్ మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు, తాహశీల్దార్ హాజరు కానున్నారు. కాప్రా మండలానికి చెందిన అర్హులైన లబ్ధిదారులు ఇక్కడికి వచ్చి చెక్కులు తీసుకోవాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు.