NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలోని శ్రీ చౌడేశ్వరి ఆలయ అభివృద్ధికి ప్యాపిలి వాస్తవ్యులు తుమ్మనేని రాజశేఖర్ నాయుడు కుటుంబం రూ.50 వేల విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు కుటుంబ సమేతంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ, మాజీ చైర్మన్ పీవీ కుమార్ రెడ్డికి ఆదివారం విరాళాన్ని అందించారు. దర్శన ఏర్పాట్ల అనంతరం దాతలకు తీర్థప్రసాదాలు అందజేశారు.
AP: 2024-25 ఏడాదికి వృద్ధిరేటులో రాష్ట్రం దేశంలో రెండో స్థానానికి చేరటంపై CM చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. స్థిర ధరల్లో 8.21శాతం వృద్ధి రేటుతో రెండో స్థానానికి చేరిందని.. AP ఈజ్ బ్యాక్ అంటూ ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వ చర్యలతో వృద్ధి రేటు సాధించామని తెలిపారు. పలు రంగాల్లో పాలసీలతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయన్నారు. కాగా 9.69శాతం వృద్ధి రేటుతో తమిళనాడు తొలిస్థానంలో ఉంది.
ELR: పెదవేగి మండలం దుగ్గిరాలలో శ్రీ రామనవమి సందర్భంగా ఆంజనేయ స్వామి వారిని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదివారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్థులతో కలిసి పానకం కలిపే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
VZM: ఎల్కోట మండలం ఖాసాపేటలో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆదివారం రాష్ట్ర టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి బాలాజీ రాంప్రసాద్తో కలసి పాల్గొన్నారు. అనంతరం జరిగిన సీతారాముల కళ్యాణంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే స్వామి వారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు.
W.G: పెంటపాడు మండలం కస్పా పెంటపాడు శ్రీ గోపాలస్వామి, ఆంజనేయస్వామి వారి ఆలయాల్లో ఆదివారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తొలుత ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేకు పటిక బెల్లం తులాభారం నిర్వహించారు.
PLD: వినుకొండ మండలం నడిగడ్డ గ్రామంలో ఆదివారం పండుగ రోజు విషాద సంఘటన చోటుచేసుకుంది. ఉదయాన్నే నలుగురు బాలురు కలిసి బహిర్భూమికి వెళ్లారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు (16) అనే బాలుడు చెరువులో ఉన్న తామర పువ్వు తీసేందుకు దిగాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో ఊపిరి ఆడక మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు.
MNCL: బెల్లంపల్లి TBGKS నాయకులు దాసరి శ్రీనివాస్ తండ్రి దాసరి రాజం ఇటీవల మరణించగా తెలంగాణ రాష్ట్ర SC, ST కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ ఆదివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముందుగా దాసరి రాజం చిత్రపటానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
KRNL: కేంద్రం తీసుకొచ్చిన వక్స్ చట్టాన్ని కర్నూలులో మైనారిటీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆదివారం కర్నూలులోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు అహమ్మద్ అలీఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, టౌన్ అధ్యక్షుడు పత్తా భాషా మాట్లాడారు. ఈ చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చిన తీరు బాధాకరమన్నారు.
VZM: దత్తిరాజేరు మండలంలోని భూపాలరాజపురం గ్రామంలో సీతారాముల వారిని గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య ఆదివారం దర్శించుకున్నారు. నూతనంగా నిర్మించిన సీతారాముల ఆలయంలో అప్పలనరసయ్య ప్రత్యేక పూజలు జరిపించారు. అంతకుముందు నాయకులు కార్యకర్తలు అప్పల నరసయ్యకు ఘనస్వాగతం పలికారు.
BPT: శ్రీరామనవమి సందర్భంగా బాపట్ల రథం బజార్లో శ్రీసీతారామ స్వామి కళ్యాణ మండపం వద్ద ఆదివారం మహిళా భక్తులకు పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి ఒక్క మహిళా భక్తురాలి మొబైల్లో ‘శక్తి యాప్’ను ఇన్స్టాల్ చేస్తూ, మహిళల రక్షణ కోసం ఈ యాప్ ఎలా ఉపయోగపడుతుందో వివరించారు. ప్రతి ఒక్క మహిళకు రాముని బాణంలా శక్తి యాప్ పనిచేస్తుందన్నారు.
NRML: బైంసా మండల కేంద్రంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని హిందూ వాహిని ఆధ్వర్యంలో శోభాయాత్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ నగేష్, ఎమ్మెల్యే రామారావు పటేల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నగేష్ మాట్లాడుతూ.. ప్రజలందరూ శాంతియుతంగా పండుగలు నిర్వహించుకోవడం గొప్ప విషయం అన్నారు. శ్రీరాముని జీవితం అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
ADB: సోనాల మండల కేంద్రంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. రోజురోజుకు ఎండలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చేయటం పట్ల వారిని ఎమ్మెల్యే అభినందించారు. చలివేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
‘స్త్రీ 2’ కోసం నటి శ్రద్ధా కపూర్ను ఎంపిక చేసింది తాను కాదని దర్శకుడు అమర్ కౌశిక్ చెప్పాడు. నిర్మాత దినేష్ విజయ్ తనని ఎంపిక చేశాడని, ఆమెను ఎంపిక చేయడానికి కారణం కూడా ఆయన తనతో చెప్పాడని తెలిపాడు. ‘శ్రద్ధ అచ్చం దెయ్యంలా నవ్వుతుందని, ఈ పాత్రకు తను అయితే పూర్తి న్యాయం చేయగలదని దినేష్ నాతో చెప్పాడు’ అని కౌశిక్ పేర్కొన్నాడు. దీంతో నెటిజన్లు నిర్మాతపై ఫైరవుతున్నారు.
బీజేపీ 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ పార్టీ శ్రేణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కార్యకర్తలే మా పార్టీకి వెన్నెముక. వారి శక్తి, ఉత్సాహం ప్రేరణదాయకం. కొన్ని దశాబ్దాలుగా పార్టీ బలోపేతం కోసం తమ జీవితాలను అంకితం చేసినవారి సేవలు మరువలేనివి. బీజేపీ సుపరిపాలన అజెండాను దేశప్రజలంతా చూస్తున్నారు’ అని తెలిపారు.
TG: శ్రీరామనవమి సందర్భంగా HYDలోని సీతారాంబాగ్లో సీతారాముల కళ్యాణమహోత్సవం జరగుతోంది. కళ్యాణం అనంతరం శోభాయాత్ర నిర్వహించనున్నారు. సీతారాంబాగ్ నుంచి సుల్తాన్ బజార్ వరకు 6.2 కి.మీల మేర యాత్ర సాగనుంది. ఇందుకోసం 20వేల మంది పోలీసులతో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో HYDలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.