AKP: అచ్యుతాపురం మండలం జగ్గన్నపేట గ్రామంలో గల సత్తెమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలో ప్రవేశించి హుండీ తెరిచి భక్తులు సమర్పించిన కానుకలను ఎత్తుకెళ్లారని గ్రామస్తులు తెలిపారు. శనివారం ఉదయం చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. మూడు నెలల నుంచి హుండీని తెరవలేదన్నారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామన్నారు.
MHBD: నెల్లికుదురు మండల కేంద్రంలో ఈనెల 16న తెలంగాణ క్రీడా పాఠశాల ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎంఈవో రాందాస్ తెలిపారు. 3వ తరగతి విద్యార్థులు, 4వ తరగతి ప్రవేశాల కోసం క్రీడలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. విద్యార్థులు తమ వెంట ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, బోనో ఫైడ్ సర్టిఫికెట్లతో రావాలని సూచించారు.
ASF: జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. బెజ్జూర్ 40.1°C, కెరమెరి 39.8, సిర్పూర్ (టీ) 39.7, రెబ్బెన 39.5, కౌటాల 39.3, ఆసిఫాబాద్ 39.2, వాంకిడి 38.9, తిర్యాణి 38.9, దహెగాం 38.9, కాగజ్ నగర్ 38.7, జైనూర్ 38.7, చింతలమానేపల్లిలో 38.6 °Cలుగా నమోదు అయ్యాయి.
GNTR: తెనాలిలో మానవత్వం వెలుగు చూసింది. రైలు నుంచి పడిపోయి మృతి చెందిన పశ్చిమ బెంగాల్కు చెందిన బిందం నాయక్ (39) మృతదేహానికి స్థానికులు అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లే స్థోమత లేకపోవడంతో కుర్రా శ్రీను, అతని మిత్ర బృందం ముందుకు వచ్చి దహన సంస్కారాలు పూర్తి చేశారు.
SDPT: బెజ్జంకి మండలంలో ప్రారంభమైన పదవ తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా సర్పంచ్ బొల్లం శ్రీధర్ పెద్దన్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను కలసి ధైర్యం చెప్పారు. భయం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కష్టపడి చదివితే విజయాన్ని సాధించవచ్చని తెలిపారు.
GDWL: వ్యర్థాలను రోడ్లపై వేసి ఆరోగ్య సమస్యలను, దోమల బెడదను కొని తెచ్చుకోవద్దు అని కౌన్సిలర్లు తిరుమలేష్, పాగుంట సువర్ణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయిజ మున్సిపాలిటీలో ప్రజాపాలన 99 రోజుల ప్రణాళికలో భాగంగా 1వ, 12వ వార్డుల్లో శనివారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం చేపట్టారు. తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి మున్సిపాలిటీ వాహనాల ద్వారా తరలించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 19న ఈ చిత్రం గ్రాండ్గా విడుదల కానుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ కోసం ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక శ్రీలీల, రాశి ఖన్నా కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
E.G: జనసేన పార్టీ 13 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఇంఛార్జ్ అత్తి సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక దేవిచౌక్ సెంటర్లో భవన నిర్మాణ కార్మికులకు అల్పాహార వితరణ కార్యక్రమం చేపట్టారు. శనివారం ఉదయం చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆంధ్ర రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ డైరెక్టర్ గంటా స్వరూపరాణి హాజరై ఆహారాన్ని పంపిణీ చేశారు.
TG: మూసీ రివర్ ఫ్రంట్ మాస్టర్ ప్లాన్ను సింగపూర్కు చెందిన సంస్థ రూపొందించింది. ప్రధానంగా ఆరు ప్రధాన అంశాలుగా ప్రణాళికను తీసుకొచ్చింది. నదిపై వంతెనలు, రోడ్లు, ట్రంపెట్లతో పాటు నగరాన్ని, ఓఆర్ఆర్ను అనుసంధానించేలా ఎలివేటెడ్ కారిడార్లు, ప్రజలకు అనువైన రవాణా సౌకర్యాలు, రెస్టారెంట్లు, హోటళ్ల అభివృద్ధిని సంస్థ విశ్లేషించింది.
WNP: గోపాల్పేట్ మండల్ కేంద్రంలో మొదటి రోజు విద్యార్థులకు పరీక్ష కేంద్రానికి ఆర్థిక సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం అన్ని విధాలుగా పరీక్ష కేంద్రం చుట్టూ పోలీస్ బందోబస్తు నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు.
NGKL: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో పదో తరగతి విద్యార్థుల సౌకర్యార్థం కోసం డిపో మేనేజర్ యాదయ్య ఆదేశాల మేరకు ఈరోజు హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు బస్సుల వేళలు, రూట్ల గురించి సమాచారం తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రయాణికులు, విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను ఇక్కడ తెలియజేయవచ్చన్నారు.
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేసవి తీవ్రతతో కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. ఉమ్మడి జిల్లాలో కేజీ స్కిన్ చికెన్ కిలో రూ. 320 నుంచి 330 మధ్య పలుకుతుండగా.. స్కిన్లెస్ చికెన్ రూ. 300 వరకు పలుకుతున్నట్లు విక్రయదారులు తెలిపారు. వేసవి వల్ల కోళ్లు చనిపోవడం, ఫాముల్లో ఉత్పత్తి తగ్గడంతో కొరత ఏర్పడిందని వ్యాపారులు వెల్లడించారు.
MDK: జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల కొరత లేకుండా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులతో సమీక్షించారు. అక్రమ నిల్వలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించారు. గ్యాస్ బుకింగ్ల మధ్య పట్టణాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజుల గ్యాప్ ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, నిరంతర సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.