• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రభుత్వానికి ఇది గుణపాఠం: కేసీఆర్

TG: హెచ్‌సీయూ ఉదంతాన్ని ప్రభుత్వం గుణపాఠంగా తీసుకోవాలని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా HCU విద్యార్థులకు చూపిన పోరాట స్ఫూర్తిని ఆయన అభినందించారు. యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమి వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి సరికాదన్నారు. విద్యార్థుల ఆందోళనకు మద్ధతుగా నిలిచిన రాజకీయ పార్టీలను కూడా కేసీఆర్ ప్రశంసించారు.

April 5, 2025 / 08:19 PM IST

విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో గృహాలు దగ్ధం

కృష్ణా: మోపిదేవిలోని ప్రధాన రహదారిలో కాలువ గట్టు పక్కన ఉన్న పోరంబోకు స్థలంలో నాలుగు గృహాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా శనివారం అగ్నికి ఆహుతి అయ్యాయి. రోడ్డు పక్కన నాలుగు కుటుంబాల వారి గృహాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అంటుకుని తగలబడ్డాయి. అవనిగడ్డ ఫైర్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలాన్ని చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

April 5, 2025 / 08:18 PM IST

రేపు భీంగల్‌లో పర్యటించనున్న ఎమ్మెల్సీ మహేష్

NZB: పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తన సొంత మండలమైన భీంగల్‌లో ఆదివారం పర్యటించనున్నారు. పిప్రి గ్రామంలోని లొద్దిరామన్న ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా జరిగే అంకురార్పణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు.

April 5, 2025 / 08:18 PM IST

‘అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి’

VZM: పోలీసుశాఖ ఆధ్వర్యంలో దళిత వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు ముఖ్య అతిధిగా హాజరై బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడన్నారు.

April 5, 2025 / 08:18 PM IST

రోడ్డు ప్రమాదంలో యువతి మృతి

SRPT: రోడ్డు ప్రమాదంలో శనివారం పిల్లలమర్రి గ్రామానికి చెందిన దాసరి విజిత(23) మృతి చెందింది. సూర్యాపేట మండలం రాయినిగూడెం సమీపంలో 7 ఆర్ హోటల్‌లో పని చేస్తున్న విజిత విధులకు వెళ్తూ హోటల్ దగ్గర రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుండి సూర్యాపేట వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టగా అక్కడిక్కడే మృతి చెందింది.

April 5, 2025 / 08:17 PM IST

భక్తులతో కిటకిటలాడిన గంజిహళ్లి గ్రామం

KRNL: గోనెగండ్ల పరిధిలోని గంజిహళ్లిలో వెలసిన హజరత్ మహాత్మా బడే సాహెబ్ నెల ఉర్సు మహోత్సవం ఘనంగా జరుగుతోంది. దర్గాను దర్శించుకోవడానికి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని దర్గా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు చిన్న ముదుగోలు తెలిపారు.

April 5, 2025 / 08:15 PM IST

‘గంట వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం’

VZM: లక్కవరపుకోట పోలీసు స్టేషన్ పరిధి రంగారాయపురం గ్రామంలో ఐదు సంవత్సరాల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన 17 సంవత్సరాల మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నామని విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు శనివారం తెలిపారు. వివరాల మేరకు ఏప్రిల్ 4న రాత్రి టివీ చూసేందుకు వచ్చి, కుటుంబసభ్యులు వేరే పనుల్లో నిమగ్నమై ఉండగా నిందుతుడు నేరానికి పాల్పడ్డరన్నారు.

April 5, 2025 / 08:09 PM IST

లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

NLR: వలేటివారిపాలెం మండలం మాలకొండ గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శనివారం దర్శించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యేకు వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శనం ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

April 5, 2025 / 07:55 PM IST

ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

NLR: రాపూరు మండలంలో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. పులిగిలపాడు గ్రామం వద్ద ఆటో-బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రుడిని జోరోపల్లికి చెందిన వల్లూరు జగదీశ్‌గా స్థానికులు గుర్తించారు.

April 5, 2025 / 07:40 PM IST

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన ఉపకులపతి

కృష్ణా: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ను కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాంజీ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. వెలగపూడి సచివాలయంలో ఆయనను కలిసి విశ్వవిద్యాలయం అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. భవిష్యత్తులో విశ్వవిద్యాలయ అభివృద్ధికి సహకారాన్ని అందించాలని ఉపకులపతి రాంజీ కోరారు.

April 5, 2025 / 07:29 PM IST

పిన్నెల్లి శవ రాజకీయాలు మానుకోవాలి

PLD: మాచర్ల మాజీ ఎమ్యెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి శవ రాజకీయాలు మానుకోవాలని మాచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వీరాస్వామి అన్నారు. మాచర్ల మండలం పసువేములలో మామ అల్లుళ్ల మధ్య భూ వివాదంలో 4 నెలల క్రితం అల్లుడిని మామ గొడ్డలితో నరికితే ఇప్పటికీ అల్లుడు కోమాలో ఉన్నాడన్నారు. ఆ కక్ష్యతో అల్లుడి తల్లితో పాటు కుటుంబ సభ్యులు మామను హత్య చేసి చంపారన్నారు.

April 5, 2025 / 07:00 PM IST

మర్రిపాడు మండలంలో పర్యటించనున్న మంత్రి ఆనం

NLR: దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈనెల 7వ తేదీన సోమవారం మర్రిపాడు మండలంలో పర్యటించనున్నారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు మంత్రి కార్యాలయ సిబ్బంది శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

April 5, 2025 / 06:55 PM IST

పెంచలకోన స్వామివారికి విశేష పూజలు

NLR: రాపూరు మండలం పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.

April 5, 2025 / 06:20 PM IST

రైలులో దోపిడి.. దూకుడు పెంచిన పోలీసులు

NLR: కావలి జీఆర్పీఎఫ్ పరిధిలోని అల్లూరు రోడ్డు పడుగుపాడు రైల్వే స్టేషన్ల మధ్య రెండు రోజుల క్రితం దుండగులు రైలు సిగ్నల్స్ ట్యాంపరింగ్ చేసి ప్రయాణికుల నుంచి బంగారం, నగదును దోచేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై శనివారం రైల్వే SP రాహుల్ మీనా ఘటనా స్థలానికి చేరుకుని రైలు ఆగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. దుండగులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

April 5, 2025 / 05:35 PM IST

కత్తులు చూపించి 3.7 కిలోల బంగారం చోరీ

AP: చిత్తూరులోని వెంకటగిరికోటలో 3.7 కిలోల బంగారం దోపిడీ జరిగింది. తమిళనాడులోని వేలూరు నుంచి కర్నాటకలోని బంగారుపేటకు తరలిస్తుండగా దుండగులు బంగారాన్ని ఎత్తుకెళ్లారు. కారును అడ్డగించి కత్తులు చూపించి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

April 5, 2025 / 05:27 PM IST