• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మండలంలో భయపెడుతున్న పేలుళ్లు

TPT: చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లెలోని క్వారీల్లో పేలుళ్లు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. పేలుళ్ల ధాటికి కొండపై నుంచి భారీ బండరాయి దొర్లుకుంటూ వచ్చి చంద్రగిరి-నాగయ్య గారిపల్లె రోడ్డుపై పడింది. ఆ సమయంలో వాహనాల రాకపోకలు తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. పేలుళ్ల శబ్దానికి అంజనేయపురం గ్రామంలోని ఇళ్లు కంపించాయని స్థానికులు తెలిపారు.

March 14, 2026 / 09:24 AM IST

రికార్డు లేని 33 వాహనాలు సీజ్: సిఐ నగేష్ బాబు

KDP: సరైన పత్రాలు లేని 30 మోటార్ సైకిల్‌లను, 3ఆటోలను స్వాధీనం చేసుకున్నామని ముద్దునూరు సీఐ నగేష్ బాబు తెలిపారు. శనివారం నాడు ముద్దునూరు గ్రామంలో LM కాంపౌండ్ ప్రాంతంలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రతి వాహనానికి సంబంధిత రికార్డులన్నీ  క్షుణ్ణంగా ఉండాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎర్రగుంట్ల, తాళ్ల పొద్దుటూరు, కొండాపురం సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

March 14, 2026 / 09:22 AM IST

సాగునీటి కోసం రైతుల ఆందోళన

SDPT:  పంటలకు సాగు నీటిని అందించాలని చిన్నకోడూరు మండలం గంగాపూర్‌లో రైతులు రైల్వే లైన్ పనులను అడ్డుకోని ఆందోళన చేపట్టారు. రంగనాయకసాగర్ ఎడమ కాలువ కింద ఉన్న పిల్ల కాలువ పక్కన రైల్వే లైన్ పనులు జరుగుతున్నాయని, రైల్వే లైన్ బ్రిడ్జి నిర్మించాల్సి ఉండగా, పనులు నిలిచిపోవడంతో సాగు నీరు వెళ్లడానికి అడ్డంకిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

March 14, 2026 / 09:21 AM IST

ఆశ్రమ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు

ASR: కొయ్యూరు మండలం కొమ్మిక బాలికల ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం పాఠశాల 14వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యాలతో అలరించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనపరచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసినట్లు పాఠశాల హెచ్ఎం సత్యనారాయణ తెలిపారు. విద్యార్ధులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు.

March 14, 2026 / 09:20 AM IST

‘500 మంది ‘సైబర్ సింబా’లకు శిక్షణ’

HYD: సైబర్ నేరగాళ్లను అడ్డుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పిస్తున్న నేరాలు ఆగడం లేదు. దీంతో ‘సైబర్ సింబా’ పేరుతో వాలంటీర్లను సిద్ధం చేశారు. తొలిదశలో 500 మందికి శిక్షణ ఇచ్చారు. వీరు పోలీస్ స్టేషన్‌తో అనుసంధానమై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. వీరికి హైదరాబాద్ సీపీ సజ్జనార్ శుభాకాంక్షలు తెలిపారు.

March 14, 2026 / 09:20 AM IST

ముగ్గురు విలేకర్లపై కేసు నమోదు

KDP: ప్రొద్దుటూరు ఆర్ట్స్ కాలేజీ రోడ్డుకు చెందిన షమీం పిర్యాదు మేరకు ముగ్గురు విలేకర్లపై కేసు నమోదు చేసినట్లు SI మధుసూధన్ రెడ్డి తెలిపారు. ముగ్గురు విలేకర్లు ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి, బెదిరించి, దాడి చేశారని షమీం ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. షమీమ్ భర్త నజీర్ విలేకర్లు బెదిరించారనే అవమానంతో సూసైడ్ నోట్ రాసి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

March 14, 2026 / 09:20 AM IST

ట్రాన్స్‌ఫార్మర్ వేయడానికి రూ 12 వేలు తీసుకున్న అధికారులు

SRCL: ట్రాన్స్‌ఫార్మర్ వేయడానికి తంగళ్ళపల్లి సెస్ అధికారులు రూ 12 వేలు తీసుకున్నారని తంగళ్ళపల్లి రైతులు రంగు అంజయ్య, బొడ్డు శేఖర్ ఆరోపించారు. ట్రాన్స్‌ఫార్మర్ సరిగా లేక మోటర్ లిస్ట్ స్టార్టర్లు కాలిపోతుంటే సెస్ అధికారులను సంప్రదించామన్నారు. తక్షమే పని కావాలంటే రూ 60 వేల నుంచి రూ. లక్ష ఖర్చవుతుందని చెప్పారన్నారు. ఆల్రెడీ రూ 12 వేలు చెల్లించామని తెలిపారు.

March 14, 2026 / 09:20 AM IST

పటాన్చెరులో మహిళ అదృశ్యం

SR : మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన సురేఖ పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైంది. ఇస్నాపూర్‌లో ఆటో నడుపుతున్న బంధువు వికాస్ ఇంటికి వచ్చిన ఆమె, ఈ నెల 11న పెళ్లి చూపుల కోసం డ్రెస్ కొనడానికి వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించకపోవడంతో వికాస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 14, 2026 / 09:19 AM IST

సాంకేతిక వ్యవసాయ విధానం పై అవగాహన సదస్సు

PDPL: పాలకుర్తి రైతు వేదిక ఆవరణలో ఏర్పాటుచేసిన కార్య క్రమంలో రైతులకు నూతన సాంకేతిక వ్యవసాయ విధానాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామగిరి ఖిల్లా శాస్త్రవేత్తల బృందం పాల్గొని విత్తనాలు, ఎరువుల వాడకం, నీటి నిర్వహణ, పంటల బీమా, మార్కెటింగ్ సౌకర్యాల గురించి వివరించారు. భూసార పరీక్షలు, ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే లాభాల గురించి అవగాహన కల్పించారు.

March 14, 2026 / 09:18 AM IST

గుత్తి కోట ఉత్సవాల ఏర్పాట్ల పనులు పరిశీలన

ATP: గుత్తిలో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి రెండు రోజులపాటు జరిగే గుత్తి కోట ఉత్సవాల ఏర్పాట్లు పనులు పూర్తయ్యాయని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా తెలిపారు. రూ.50 లక్షల నిధులతో రెండు రోజులపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఇవాళ సాయంకాలం 5.30 గంటలకు ఈ ఉత్సవాలను కలెక్టర్‌తో పాటు ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారన్నారు.

March 14, 2026 / 09:17 AM IST

పరీక్ష కిట్లను అందించిన మేయర్

నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత శుక్రవారం 54వ డివిజన్ వెంకటేశ్వరపురం మున్సిపల్ పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పరీక్ష కిట్లను బహూకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. విద్యార్థులు మానసిక ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

March 14, 2026 / 09:17 AM IST

‘విద్యకు 30 శాతం బడ్జెట్ కేటాయించాలి’

MBNR: రాష్ట్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని కోరుతూ AISF నాయకులు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి శుక్రవారం వినతిపత్రం ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలపై అసెంబ్లీలో మాట్లాడాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు రాజు, లక్ష్మణ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

March 14, 2026 / 09:15 AM IST

ఈనెల 16 నుంచి జిల్లాలో ఒంటిపూట బడులు

CTR: జిల్లాలో ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్లు DEO రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలన్నారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు, పరీక్షలు లేని రోజుల్లో ఆ పాఠశాలలు ఉదయం నుంచి పని చేయాలని సూచించారు.

March 14, 2026 / 09:15 AM IST

IPL 2026: KKRకు మరో భారీ షాక్‌

టీమిండియా యువ ప్లేయర్ హర్షిత్ రాణా గాయంతో T20 WCకి దూరమైన సంగతి తెలిసిందే. టోర్నీ సమయంలోనే సర్జరీ చేయించుకున్న అతను ఇంకా కోలుకోకపోవడంతో IPL-19వ సీజ‌న్‌కు ముందు KKRకు మరో బిగ్ షాక్ తగిలింది. దీంతో 19 వికెట్లతో 2024 టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించిన రాణా స్థానంలో ఎవరిని తీసుకోవాలనే యోచనలో ఆ జట్టు పడింది. ఇక ఇప్పటికే మతీషా పతిరణ కూడా గాయంతో KKRకు దూరమయ్యాడు.

March 14, 2026 / 09:14 AM IST

‘మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండ’

WG: ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకార కుటుంబాలకు జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే నాయకర్ ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియో భాగంగా, మొదటి విడతగా రూ.5 లక్షల విలువ గల చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు ఆయన పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.

March 14, 2026 / 09:13 AM IST