• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కేజీబీవీలో బాలికలపై ఎలుకల దాడి

BDK: చండ్రుగొండలోని కేజీబీవీ బాలికల వసతి గృహంలో గురువారం విద్యార్థులపై ఎలుకలు దాడి చేసి గాయపరిచాయి. ఎంఈవో సత్యనారాయణ వివరాల ప్రకారం.. పడుకొని ఉన్న ఇద్దరు బాలికలపై ఎలుకలు దాడి చేసి స్వల్పంగా గాయపరిచాయని చెప్పారు. వసతి గృహాన్ని సందర్శించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

February 13, 2025 / 11:00 AM IST

గుమ్మలక్ష్మీపురం వైసిపి మండలాద్యక్షనిగా దీనమయ్య నియామకం

VZM: గుమ్మలక్ష్మీపురం వైసీపి మండల అధ్యక్షుడిగా కుంబురుకు దీనమయ్యను నియమిస్తూ వైసీపీ అధిష్టానం ఉత్తర్వులు జారి చేసింది. ఈ సందర్భంగా దీనమయ్య గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో మూడోసారి మండల అధ్యక్షునిగా నియమించిన అదిష్టానికి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి, డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

February 13, 2025 / 10:55 AM IST

సేవాలాల్ జయంతి ఉత్సవాల కోసం స్థల పరిశీలన

KMM: బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంతు సేవాలాల్ 286వ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పాలేరు నియోజకవర్గ స్థాయిలో ఈనెల 15వ తేదీన కూసుమంచి కేంద్రంలో నిర్వహించబోయే, జయంతి ఉత్సవాల కోసం గురువారం కూసుమంచి తహసీల్దార్ కరుణ ఉత్సవాల స్థలాన్ని స్థానిక బంజారాలతో కలిసి పరిశీలించారు. ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.

February 13, 2025 / 10:43 AM IST

వ్యవసాయబావిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

JGL: కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామశివారులో ఓ వ్యవసాయ బావిలో గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్టు గ్రామస్థులు గురువారం గుర్తించారు. మృతుడికి 30 ఏళ్ళు ఉంటాయన్నారు. బావి ఒడ్డు పై అంగీ, చెప్పులు ఉండగా.. మృతుడి ఒంటిపై పాయింట్ ఉంది. ఇది హత్యనా.. లేక ఆత్మహత్యనా తెలియాల్సి ఉందని గ్రామస్థులు పేర్కొన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

February 13, 2025 / 10:34 AM IST

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

NDL: పాణ్యం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పాణ్యం సమీపంలో ఉన్న సుగాలి మెట్ట వద్ద ట్రాక్టరు బైక్ ఢీకొన్నాయి. ట్రాక్టరు బైక్ ఢీకొన్న ఘటనలో గురువారం ఒకరు మృతి చెందారు. పాణ్యం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని యొక్క వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

February 13, 2025 / 10:32 AM IST

మూడు పొట్టేళ్లను పొట్టన పెట్టుకున్న చిరుత

KRNL: పెద్దకడబూరు గ్రామంలో కటికె మిన్నుల్లాకు చెందిన రూ. 60 వేలు విలువ చేసే మూడు పొట్టేళ్లను చిరుత పులి పొట్టన పెట్టుకుందని బాదితుడు కన్నీరు మున్నీరుగా విలపించారు. దేవుడి కోసం మూడు పొట్టేళ్లను పెంచినట్లు, అయితే రాత్రి ఇంటి వద్ద కట్టేసి ఉండగా మూడు పొట్టేళ్లను చిరుత పులి చంపేసిందని వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

February 13, 2025 / 10:10 AM IST

ఇల్లందులో ఎస్ఏపీఫైల్ లైఫ్ సైకిల్ మేనేజ్‌మెంట్ పై శిక్షణ

BDK: సింగరేణి ఇల్లందు ఏరియాలో SAP ఫైల్ లైఫ్ సైకిల్ మేనేజ్‌మెంట్ పై గురువారం ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేట్ ERP విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏరియా జీఎం వి.కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. త్వరలోనే మాన్యువల్ ఫైల్ డిస్పాచ్ నుంచి ఆన్‌లైన్ విధానానికి మారుతామని అన్నారు. ఈ మార్పు సమయం, శ్రమను ఆదా చేస్తుందని తెలిపారు.

February 13, 2025 / 10:06 AM IST

మాచర్ల నుంచి శైవక్షేత్రాలకు 58 బస్సులు 

PLD: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఫిబ్రవరి 26న వివిధ శైవక్షేత్రాలు వేడుకలు నిర్వహించనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు 58 బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ డీఎం బత్తుల వీరాస్వామి తెలిపారు. పాలువాయి జంక్షన్ నుంచి సత్రశాల వరకు గల రహదారిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 58 బస్సులను నడుపుతామని టిక్కెట్ ధరలో ఎలాంటి పెరుగుదల ఉండదన్నారు.

February 13, 2025 / 09:21 AM IST

చెక్ పోస్ట్ ‌వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పోలీసులు

NLG: బర్డ్ ఫ్లూ వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు సరిహద్దు ప్రాంతాలలో తనిఖీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు ఎగుమతి అవుతున్న కోళ్ల వాహనాలను తెలంగాణ పోలీసులు, పశు వైద్య శాఖ అధికారులు గురువారం కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ వద్ద వాహనాలు నిలిపి తనిఖీలు నిర్వహించారు.

February 13, 2025 / 08:57 AM IST

మస్క్‌తో ప్రధాని మోదీ భేటీ!

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌తో ప్రధాని మోదీ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. మస్క్, భారత మార్కెట్‌లో తన ఎలక్ట్రిక్ కార్ల వ్యాపారానికి అనుకూలమైన పరిస్థితులను కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే, దేశంలో సరసమైన ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు, స్టార్‌లింక్ కార్యకలాపాలకు ముందస్తు అనుమతులు పొందేందుకు మస్క్ కసరత్తు చేస్తునట్లు తెలుస్తోంది.

February 13, 2025 / 08:29 AM IST

మద్యం విక్రయిస్తే రూ.లక్ష, తాగితే రూ.20వేల జరిమానా

NLG: చిట్యాల మండలం ఏపూరులో మహిళలు, గ్రామస్థులు మద్య అమ్మకాలు నిషేధించాలని ర్యాలీ చేసిన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన ఓ యువకుడు మద్యం తాగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్థులు, మహిళలు తెలిపారు. ఈ నేపథ్యంలో మద్యం విక్రయిస్తే రూ.లక్ష, తాగితే రూ.20వేలు జరిమానా విధిస్తున్నట్లు పేర్కొన్నారు.

February 13, 2025 / 08:12 AM IST

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్

కృష్ణా:  టీడీపీ గన్నవరం నియోజకవర్గ కార్యాలయంపై దాడి కేసులో నిందితుల బెయిల్‌పై ఇవాళ తీర్పు వెలువడనుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తాజాగా అరెస్ట్ చేశారు. కేసులో 88 మందిని నిందితులుగా చేర్చగా ఇప్పటికే 45మందిని అరెస్ట్ చేశారు. కాగా ఫిర్యాదుదారుడు సత్యవర్దన్ తనకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని, భయపెట్టి ఫిర్యాదు చేయించారన్నారు. 

February 13, 2025 / 08:03 AM IST

గాయని పార్వతిని సన్మానించిన ఛైర్మన్ సుబ్బారెడ్డి

డోన్ పట్టణంలో షిరిడి సాయిబాబా మందిరం ఉత్సవాలులో భాగంగా మందిరం నందు బుధవారం సాయంత్రం గాయని పార్వతీ గారిచే సాంస్కృతిక, సాయిబాబా పాటలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి దంపతులు, సాయిబాబా మందిరం కమిటీ సభ్యులు గాయని పార్వతిని మరియు సహయ గాయకుడుని శాలువా తో సత్కరించింది.

February 13, 2025 / 07:32 AM IST

‘విద్యుత్ సమస్య ఉంటే 1912కు కాల్ చేయండి’

MDK: వేసవిలో విద్యుత్ సమస్యలుంటే 1912కు కాల్ చేయాలని చీఫ్ ఇంజినీర్ బాలస్వామి వినియోగదారులకు సూచించారు. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బుధవారం సాయంత్రం మెదక్ విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో ఎస్ఈ శంకర్‌తో కలిసి డిఈ,ఎడిఎ, ఏఈలతో సమీక్షించారు. మెదక్, బాలనగర్‌లో కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.

February 13, 2025 / 06:55 AM IST

‘జేఈఈ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు’

NLD: న్యూక్లియస్ జూనియర్ కళాశాల విద్యార్థులు జేఈఈ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించగా, కళాశాల కరస్పాండెంట్ మురళీధర్ రెడ్డి అభినందించారు. సీనియర్ నీట్ /జేఈఈ ఫ్యాకల్టీతో ఉత్తమ శిక్షణ అందిస్తుండగా, విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డైరెక్టర్ వాసుదేవ రెడ్డి న్యూక్లియస్ ప్రతీ ఏటా జాతీయ స్థాయి ర్యాంకులు సాధించడం సంప్రదాయమన్నారు.

February 13, 2025 / 06:52 AM IST