కృష్ణా: ఫోన్ కాల్ వచ్చిందని ఇంటి నుంచి బయటకి వెళ్లి మృత్యువాత పడ్డ యువకుడి మృతి కోడూరు మండలంలో కలకలం రేపింది. సాధారణ రైతు కుటుంబానికి చెందిన లక్ష్మీ వర్ధన్(22) బీటెక్ పూర్తిచేశాడు. తన స్నేహితులతో కలిసి కేటరింగ్ పనులకు వెళుతూ ఉంటాడు. కానీ అనుకోని విధంగా ఇలా మరణించి శవమై కనిపించడంతో అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు.
TG: కంచ గచ్చిబౌలి భూవివాదంపై CM రేవంత్ రెడ్డికి మంత్రులు కీలక ప్రతిపాదనలు అందించారు. ఆ భూముల్లో అతిపెద్ద ఎకో పార్క్ ఏర్పాటు చేయాలని.. బర్డ్ పార్క్, బటర్ ఫ్లై గార్డెన్, తాబేళ్ల పార్క్, లేక్స్ అండ్ గార్డెన్స్కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆ 400 ఎకరాలతో పాటు మరో వెయ్యి ఎకరాలు సేకరించాలని, ఎకో పార్క్కు రాజీవ్ పార్క్గా పేరు పెట్టాలని ప్రతిపాదించారు.
MDK: తూప్రాన్ మండలం పడాలపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన భూపతిరెడ్డి పదవి విరమణ వీడ్కోలు సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈవో రాధాకిషన్ పాల్గొన్నారు. డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు సమయపాలన పాటించి విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చి దిద్దాలన్నారు.
GNTR: టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త సీమ రాజాపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన కుటుంబంపై అసభ్యకర పోస్టులు పెట్టినట్లు ఆరోపణలు చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వేమారెడ్డి పేర్కొన్నారు.
చెపాక్ వేదికగా CSKతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది. DC బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (77), పొరేల్ (33), అక్షర్ పటేల్ (21), రిజ్వీ (20), స్టబ్స్ (24) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 183/6 పరుగులు చేసింది. ఇక CSK బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. CSK టార్గెట్ 184.
KRNL: జిల్లా SP విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు శాంతిభద్రతలపై కర్నూలు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. శనివారం అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేసి నేర రహిత జిల్లాగా తీర్చిదిదాలనే లక్ష్యంతో పని చేస్తున్నారని ఎస్పీ విక్రాంత్ తెలిపారు. డీఎస్పీ బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు సబ్ డివిజన్ సీఐలు, ఎస్సైలు బృందాలుగా ఏర్పడి కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
PLD: సత్తెనపల్లి పట్టణం శరభయ్య హై స్కూల్ గ్రౌండ్లో పోలీస్ శాఖ, బార్ అసోసియేషన్ సభ్యుల మధ్య క్రికెట్ మ్యాచ్ను సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..ఇలా ఆటల ద్వారా ఉద్యోగ భారం నుంచి విశ్రాంతి తీసుకుని, పరస్పర సహకారం పెరిగే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.
KRNL: కర్నూలులోని అతి పురాతనమైన కేసీ కెనాల్ కాలుష్యానికి గురవుతోంది. చెత్తాచెదారం, మురికితో నిండిపోయింది. దోమలకు ఆవాసంగా మారిపోయింది. కాలువ నుంచి దుర్గంధాలు వెదజల్లుతుండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమలకు ఆవాసంగా మారిందని, దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
KDP: రాజంపేట పట్టణం బోయపాలెంకు చెందిన ప్రముఖ చిత్రకారుడు నాయిని గిరిధర్ చిత్రలేఖన రంగంలో రాష్ట్రస్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్మన్ తేజస్విని ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన హస్తకళ చిత్రలేఖన ప్రదర్శనలో సుమారు 500 మంది కళాకారులు పాల్గొనగా వారిలో నాయిని గిరిధర్ చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
KDP: జమ్మలమడుగులోని స్థానిక మెయిన్ బజార్ కూడలిలో గుంతను పూడ్చి అధికారులు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని DYFI జమ్మలమడుగు పట్టణ అధ్యక్షులు ఎల్లయ్య తెలిపారు. శనివారం కూడలిలో ప్రమాదకరంగా ఉన్నగుంతను DYFI నాయకులు పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. నిత్యం రద్దీగా ఉండే కూడలి మధ్యలో గుంత ఉండటంతో వాహనదారులు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
KRNL: భారత మాజీ ఉప ప్రధాని డా. బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకొని శనివారం కర్నూలులోని 5 రోడ్ల కూడలి, RS రోడ్డు వద్ద JC డాక్టర్ B.నవ్య, రాజకీయ ప్రముఖులు ఘన నివాళి అర్పించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను గుర్తుచేసుకుంటున్నారు. అణగారిన వర్గాల కోసం జగ్జీవన్ రామ్ పోరాటం చేశారని నేతలు కొనియాడారు. కార్యక్రమంలో కోడుమూరు, పాణ్యం MLAలు పాల్గొన్నారు.
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం వెళ్లే భక్తులకు APSRTC శుభవార్త చెప్పింది. ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించింది. రాజమండ్రి నుంచి భద్రాచలానికి 8 ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 12.15 గంటలకు ఒకటి, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గంటకు ఒక బస్సు చొప్పున నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఇటీవల భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్ను ఆదుకోవడానికి క్వాడ్ దేశాలు ముందుకొచ్చాయి. మయన్మార్లోని సంక్షోభ పరిస్థితులపై భారత్, US, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తూ 20 మిలియన్ డాలర్ల ఆర్ధిక సాయం చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ వెల్లడించింది. కాగా, గత నెల 28న థాయ్లాండ్, మయన్మార్లో భూకంపం వల్ల 3 వేలకుపైగా మరణించారు.
MDK: స్వతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఉద్యమంతో పాటు బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన గొప్ప సంఘసంస్కర్త అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
SDPT: వేములవాడ రాజరాజేశ్వర సామిని శనివారం జిల్లా జడ్జి ఇండోమెంట్స్ అడిషనల్ కమిషనర్ కే.జ్యోతి దర్శించుకున్నారు. ఆలయ ఆర్చకులు స్వస్తి వేదోక్త స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈఓ వినోద్ లడ్డు ప్రసాదం అందజేశారు. వీరి వెంట ఏఈవోలు బ్రహ్మన్న గారి శ్రీనివాస్, జీ.అశోక్ కుమార్లు, పర్యవేక్షకులు ఉన్నారు.