KDP: ప్రొద్దుటూరు ఆర్ట్స్ కాలేజీ రోడ్డుకు చెందిన షమీం పిర్యాదు మేరకు ముగ్గురు విలేకర్లపై కేసు నమోదు చేసినట్లు SI మధుసూధన్ రెడ్డి తెలిపారు. ముగ్గురు విలేకర్లు ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి, బెదిరించి, దాడి చేశారని షమీం ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. షమీమ్ భర్త నజీర్ విలేకర్లు బెదిరించారనే అవమానంతో సూసైడ్ నోట్ రాసి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు.