• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆకుపై సీతారాముడి చిత్రం

KMR: పిట్లం మండలంలోని తిమ్మానగర్ గ్రామానికి చెందిన విద్యార్థిని సాయిస్మరణ శ్రీరామ నవమినిపురస్కరించుకొని ఆకుపై సీతారాముడి చిత్రాలను చూడముచ్చటగా గీసింది. పిట్లంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సాయిస్మరణ గతంలో ట్యాబ్లెట్లపై, ఆకులపై అందమైన చిత్రాలు గీసింది. చదువుతోపాటు చిత్రకళారంగంలో విద్యార్థిని రాణించడంతో ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు.

April 6, 2025 / 10:53 AM IST

ప్రత్యేక అలంకరణలో శ్రీ చౌడేశ్వరి దేవి

అనంతపురం: జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న శ్రీ చౌడేశ్వరి దేవికి ఆదివారం ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని, తీర్థప్రసాదాలను స్వీకరించారు.

April 6, 2025 / 10:06 AM IST

‘గొప్ప మహాకవి వాల్మీకి’

అనంతపురం: రాయదుర్గం పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా వాల్మీకి విగ్రహానికి, భక్తకన్నప్ప విగ్రహానికి పూలమాలలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాల్మీకి సంక్షేమ సేవా సమితి ఉపాధ్యక్షులు మలకన్న ఆధ్వర్యంలో పూజలు చేపట్టారు. రామాయణాన్ని రచించిన మహర్షి వాల్మీకి సమాజంలో మానవుల మధ్య సంబంధాలు, విలువలు,బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు తెలియజేసిన మహా ఆదికవి వాల్మీకి మహర్షి అన్నారు.

April 6, 2025 / 10:00 AM IST

శోభాయాత్ర.. ఈ రూట్లు బంద్!

HYD: శ్రీ రామనవమి శోభాయాత్ర సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని HYD ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఉదయం 9 గంటలకు సీతారాంబాగ్ నుంచి ప్రారంభమై సుల్తాన్ బజార్ వరకు కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. ఈ మార్గంలో ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్ అమలులో ఉంటుంది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకొని ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.

April 6, 2025 / 09:38 AM IST

భారీగా గంజాయి పట్టివేత

HYD: శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి నగరానికి తరలిస్తున్న సుమారు 300 కిలోల గంజాయిని సైబరాబాద్ SOT పోలీసులు పట్టుకుని, తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

April 6, 2025 / 09:36 AM IST

విగ్రహ ఆవిష్కరణలో టీడీపీ ఇన్‌ఛార్జ్

ప్రకాశం: పుల్లలచెరువు మండలం మర్రివేములలో స్వర్గీయ ఉదారపు వెంకటేశ్వర్లు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, గుంటూరు జనసేన కో ఆర్డినేటర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు వెంకటేశ్వర్లు సేవలను కొనియాడారు. వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు.

April 6, 2025 / 08:44 AM IST

పూర్తయిన ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్

ప్రకాశం: ఒంగోలు నగరంలోని ఏకేవీకే జూనియర్ కళాశాలలో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ ముగిసింది. మార్కుల మొత్తం జాబితాను తయారు చేసి కంప్యూటరీకరణ కూడా పూర్తయినట్లుగా అధికారులు తెలిపారు. కాగా, ఎక్కడైనా లోపాలు ఉన్నాయా అనేవి చూసి తప్పులు ఉంటే వాటిని సరిచేస్తున్నామని తెలిపారు.

April 6, 2025 / 08:38 AM IST

ఆర్టీసీ డ్రైవర్ పై దాడి.. ఇద్దరిపై కేసు

SDPT: ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ తెలిపారు. శనివారం జనగాం డిపోకు చెందిన బస్సులో ఎంఏ జావిద్, ఎస్కే షమీం సిద్దిపేటలో బస్సు ఎక్కి దుద్దెడ మసీదు వద్ద బస్సు ఆపమని అడిగారు. హైవేపై ఆపడం కుదరదని డ్రైవర్ బదులిచ్చాడు. దీంతో డ్రైవర్ నరసింహా రెడ్డిని దుర్భాషలాడుతూ దాడి చేశారు.

April 6, 2025 / 08:26 AM IST

నేడు నగరమంతటా ‘జై శ్రీరామ్’ స్లోగనే!

HYD: నగరం నేడు ‘జై శ్రీరామ్’ నినాదంతో హోరెత్తనుంది. ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా నగరంలోని సీతారాంబాగ్ టెంపుల్, ఆకాశూరి హనుమాన్ టెంపుల్ నుంచి భారీ శోభయాత్రలకు సర్వం సిద్ధమైంది. హనుమాన్ టేక్తి వద్ద ఈ యాత్ర ముగుస్తుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు.

April 6, 2025 / 08:00 AM IST

శ్రీ రామనవమి.. వన దుర్గామాతకు ప్రత్యేక పూజలు

MDK: శ్రీ రామనవమిని పురస్కరించుకొని ఏడుపాయల శ్రీ వన దుర్గాభవాని మాతకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం వేకువజామున ఆలయ అర్చకులు మంజీరా నదీజలాలతో అభిషేకం చేసి పట్టువస్త్రాలు, వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించి, సహస్రనామార్చన, కుంకుమార్చన పూజల అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.

April 6, 2025 / 07:37 AM IST

రేపు ఎక్సైజ్ స్టేషన్ నందు వేలంపాట

NDL: డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ డోన్‌లో రేపు ఉదయం సుమారు 10.00 గంటలకు స్కార్పియో, సిడిడిలక్స్, స్కూటీ మూడు వాహనములకు వేలం నిర్వహించనున్నట్లు CI బి. వరలక్ష్మి తెలిపారు. ఆసక్తి గల వ్యక్తులు డోన్‌లో నిర్వహించే వేలం పాటలో పాల్గొనాలని కోరారు.

April 6, 2025 / 07:36 AM IST

బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వృద్ధుడు

ప్రకాశం: ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికతో వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. కొండపి మండలం ఉప్పలపాడులో పనుల కోసం వచ్చిన తల్లిదండ్రులు బాలికను ఇంటి వద్ద వదిలి పనులకు వెళ్తున్న సమయంలో అక్కడే ఉంటున్న సాదు వెంకటకోటయ్య బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

April 6, 2025 / 07:08 AM IST

ఒంగోలులో మసాజ్ సెంటర్‌పై దాడులు

ప్రకాశం: మసాజ్ సెంటర్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయని ఒంగోలు వాసులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు పోలీసు అధికారులు దాడులు నిర్వహించినప్పటికీ నిర్వాహకుల తీరులో మార్పు రావటం లేదని పేర్కొన్నారు. ఓ మసాజ్ సెంటర్ నిర్వాహకుడిపై ఒంగోలు తాలూకా సీఐ శ్రీనివాస్ రావు, సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్రీలను అదుపులోకి తీసుకున్నారు.

April 6, 2025 / 06:39 AM IST

చీరాల వన్ టౌన్ సీఐగా సుబ్బారావు

బాపట్ల: చీరాల వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు శనివారం ఆకస్మికంగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సూరేపల్లి సుబ్బారావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఒంగోలులో ఎస్సీ, ఎస్టీ సెల్ సీఐగా పనిచేస్తూ ఆయన బదిలీపై చీరాలకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తామని, అసాంఘిక శక్తుల ఆట కట్టిస్తానని తెలిపారు.

April 6, 2025 / 04:44 AM IST

మంత్రి తుమ్మలకు హరీశ్‌రావు ఫోన్

TG: మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మాజీమంత్రి హరీశ్ రావు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా సన్ ఫ్లవర్ రైతుల సమస్యలను తుమ్మలకు వివరించారు. సన్ ఫ్లవర్ రైతులను ఆదుకోవాలని, ఆయిల్ ఫాం రైతులను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. సిద్ధిపేట నియోజకవర్గంలో రైతులు ఆందోళనలో ఉన్నారని సన్ ప్లవర్ కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలని కోరారు.

April 5, 2025 / 08:28 PM IST