MDK: జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల కొరత లేకుండా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులతో సమీక్షించారు. అక్రమ నిల్వలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించారు. గ్యాస్ బుకింగ్ల మధ్య పట్టణాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజుల గ్యాప్ ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, నిరంతర సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.
TG: గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా దంపతులు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకున్నారు. తెల్లవారుజామున స్వామి, అమ్మవార్ల మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మేరకు ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న గవర్నర్ దంపతులకు ఈవో ఘన స్వాగతం పలికారు. గవర్నర్ దంపతులు ఆలయంలో స్వామివారికి భక్తిశ్రద్ధలతో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చన పూజలోనూ పాల్గొన్నారు.
NLG: పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ కోసం పశువైద్య సంవర్థక శాఖ ఆద్వర్యంలో టీకాలు వేసే కార్యక్రమం కట్టంగూరు మండలంలో ముమ్మరంగా సాగుతోంది. ఈ నెల 10న ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు వందల సంఖ్యలో తెల్లజాతి, నల్లజాతి పశువులకు టీకాలు వేశారు. ఇవాళ దుగినవెల్లిలో పశువులకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర చెరుకు శ్రీనివాస్ పాల్గొన్నారు.
BHNG: తండ్రి చనిపోయిన దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని ఓ విద్యార్థి పరీక్షకు హాజరయ్యాడు. మోత్కూర్కు చెందిన ఉపాధ్యాయుడు కూరెళ్ళ ఎల్లయ్య శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు. పదవ తరగతి చదువుతున్న అతని కుమారుడు కూరెళ్ళ హర్షవర్ధన్, తండ్రి మరణంతో దుఃఖంలో మునిగిపోయిన కన్నీళ్ళను దిగమింగుకుని పరీక్ష రాయడం చూపరులను కలచివేసింది.
VKB: మోమిన్పేట మండల పరిధిలోని కొత్తగడి సమీపంలో శనివారం ఆటో, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. మోమిన్పేట వెళ్తున్న ఆటో, వికారాబాద్ నుంచి వస్తున్న బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న సురేష్ కాలు విరిగి తీవ్రంగా గాయపడగా, ఆటో డ్రైవర్ స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన ప్రయాణికులు 108లో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.
JGL: ప్రభుత్వ ఆదేశాల మేరకు డీసీఈబీ (టీచర్స్ భవన్)లో జిల్లా స్థాయి కౌమార విద్య పోస్టర్ మేళా పోటీలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 83 పాఠశాలల నుంచి విద్యార్థులు గైడ్ టీచర్లతో కలిసి పాల్గొని కౌమార విద్యపై పోస్టర్లు రూపొందించారు. న్యాయనిర్ణేతలుగా జీవశాస్త్ర ఉపాధ్యాయులు తిరుపతి, పవన్ కుమార్, శ్రీనివాస్ పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు.
ATP: డి. హీరేహల్ మండలం మురడి గ్రామంలో వెలసిన ప్రసిద్ద ఆంజనేయుడు ప్రత్యేక అలంకరణలో భక్తులకు కనువిందు చేశాడు. వేకువజామునే స్వామి మూల విరాట్కి సుప్రభాత సేవ, పంచామృత వివిధ అభిషేకాలు చేపట్టి పుష్పాలు, తమలాపాకుల హారాలతో విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. స్థానిక భక్తులే కాక ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు.
ప్రకాశం: దొనకొండ మండలంలోని భూమనపల్లి, మంగినపూడి, రుద్రసముద్రం, ఇంద్లచరువు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని అర్జీలు స్వీకరించారు. తాగునీరు, రహదారులు, విద్యుత్, వ్యవసాయం, ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన సమస్యలను స్థానికులు వివరించారు. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామి ఇచ్చారు.
మూసీ పరీవాహకాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా 55 కి.మీలను ప్రభుత్వం ఐదు దశలుగా విభజించింది.జోన్ 1- గండిపేట, రాజేంద్రనగర్ ల నుంచి గాంధీ సరోవర్ వరకు 21కి.మీజోన్ 2 – గాంధీ సరోవర్ నుంచి పురానాపూల్ వరకు 6 కి.మీజోన్ 3 – పూరానాపూల్ నుంచి MGBS వరకు 4 కి.మీజోన్4 – MGBS నుంచి ఉప్పల్ వరకు 8 కి.మీజోన్ 5- ఉప్పల్ నుంచి గౌరెళ్లి వరకు 16 కి.మీ.
ELR: ఏపీ ప్రభుత్వం అంగన్వాడీ హెల్పర్లను వర్కర్లుగా ప్రమోట్ చేయడానికి కొత్త మార్గదర్శకాలను(G.O) విడుదల చేసింది. ఈ నిబంధనల ప్రకారం, 50% వర్కర్ పోస్టులు హెల్పర్లకే కేటాయించనుంది. టెన్త్ ఉత్తీర్ణత, ఐదేళ్ల సర్వీసు, ఫిట్నెస్ తప్పనిసరి. నియామక సంవత్సరం జులై 1 నాటికి 50 ఏళ్లు దాటకూడదు. సీనియారిటీ, వయస్సు, విద్యార్హతలను బట్టి పదోన్నతులు కల్పిస్తారు.
TG: రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధుల కింద మరో రూ. 640 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. వీటితో రాష్ట్రానికి 2024-25 ఆర్థిక సంవత్సరం నిధులు పూర్తిగా అందగా.. 2025-26 ఆర్థిక సంవత్సరం కింద మరో 1,255 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. వీటిని కూడా విడుదల చేయాలని మంత్రి సీతక్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
KRNL: పెద్దకడుబూరులో స్వచ్ఛత కార్యక్రమాలను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో స్వచ్ఛ రథం వాహనాన్ని టీడీపీ ఇన్చార్జి రాఘవేంద్ర రెడ్డి ప్రారంభించారు. గ్రామంలో పరిశుభ్రత, వ్యర్థాల సక్రమ నిర్వహణకు వాహనం ఉపయోగపడుతుందని తెలిపారు. స్వచ్ఛమైన గ్రామాల నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా కృషి చేయాలన్నారు. ప్రజలు పరిశుభ్రతపై మరింత అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.
‘సైయారా’తో భారీ విజయాన్ని అందుకున్న బాలీవుడ్ యంగ్ హీరో అహాన్ పాండే.. వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీ అవుతున్నాడు. అనీష్ బజ్మీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న ఆయన.. తాజాగా మరో రెండు చిత్రాలకు సంతకం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఆనంద్ ఎల్ రాయ్ తన తదుపరి చిత్రంలో మహాభారతంలోని ‘కర్ణ’ పాత్ర కోసం అహాన్ను ఎంపిక చేసినట్లు టాక్. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
AP: కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రాభివృద్ధిని చూసి YCP చీఫ్ జగన్ ఓర్వలేకపోతున్నారని BJP రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీ శర్మ విమర్శించారు. తమ పాలనలో విచ్చలవిడిగా అప్పులు చేసి, రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్నారని ధ్వజమెత్తారు. దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా AP నిలుస్తున్న వేళ ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.
PDPL: ధర్మారం మండలంలో ఇవాళ 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మండలంలో మొత్తం ఐదు కేంద్రాలలో 710 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు ఎంఈఓ ప్రభాకర్ తెలిపారు. నంది మేడారం జడ్పీ హైస్కూల్లో ఇన్విజిలేటర్లు విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.