NLG: పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ కోసం పశువైద్య సంవర్థక శాఖ ఆద్వర్యంలో టీకాలు వేసే కార్యక్రమం కట్టంగూరు మండలంలో ముమ్మరంగా సాగుతోంది. ఈ నెల 10న ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు వందల సంఖ్యలో తెల్లజాతి, నల్లజాతి పశువులకు టీకాలు వేశారు. ఇవాళ దుగినవెల్లిలో పశువులకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర చెరుకు శ్రీనివాస్ పాల్గొన్నారు.