MDK: జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల కొరత లేకుండా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులతో సమీక్షించారు. అక్రమ నిల్వలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించారు. గ్యాస్ బుకింగ్ల మధ్య పట్టణాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజుల గ్యాప్ ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, నిరంతర సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.