JGL: ప్రభుత్వ ఆదేశాల మేరకు డీసీఈబీ (టీచర్స్ భవన్)లో జిల్లా స్థాయి కౌమార విద్య పోస్టర్ మేళా పోటీలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 83 పాఠశాలల నుంచి విద్యార్థులు గైడ్ టీచర్లతో కలిసి పాల్గొని కౌమార విద్యపై పోస్టర్లు రూపొందించారు. న్యాయనిర్ణేతలుగా జీవశాస్త్ర ఉపాధ్యాయులు తిరుపతి, పవన్ కుమార్, శ్రీనివాస్ పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు.