PDPL: ధర్మారం మండలంలో ఇవాళ 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మండలంలో మొత్తం ఐదు కేంద్రాలలో 710 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు ఎంఈఓ ప్రభాకర్ తెలిపారు. నంది మేడారం జడ్పీ హైస్కూల్లో ఇన్విజిలేటర్లు విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.