TG: రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. తొలి రోజు పరీక్షకు 99.65 శాతం విద్యార్థులు హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థులు మొత్తం 5,17,197మంది రిజిస్టర్ చేసుకోగా, 5,15,374 మంది పరీక్ష రాశారు. 1,823మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు.